NewsInn

News in a Click

మోడీ పాకిస్తాన్ వెళ్ల‌డంపై బీజేపీ నేత‌లు ఏమంటారు

మోడీ పాకిస్తాన్ వెళ్ల‌డంపై బీజేపీ నేత‌లు ఏమంటారు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎలాంటి ముందుస్తు స‌మాచారం లేకుండా అప్పట్టి పాకిస్తాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ను క‌లిసేందుకు ఎలా వెళ్లారో బీజేపీ నేత‌లు చెప్పాల‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం కుట్ర‌తో అడ్డుకుంద‌న్నారు. తెలంగాణా లో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళుతుంటే కేంద్రం అది విజ‌య‌వంతం అవుతుంద‌న్న కుట్ర‌తో అడ్డుకుంద‌ని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు.ఇది కేవ‌లం ముఖ్య‌ప‌ర్య‌ట‌న అడ్డుకోవ‌డం కాద‌ని తెలంగాణా ప్ర‌జ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచిన‌ట్లే అని జ‌గ్గారెడ్డి అన్నారు. ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సీఎం పై దేశానికి వ్య‌తిరేకంగా ఉన్న వారిని క‌లిసేందుకు వెళుతున్నార‌ని ఆరోపించ‌డం స‌రైంది కాద‌న్నారు. అయితే భార‌త దేశ శ‌తృ దేశ‌మైన పాకిస్తాన్ కు మోడీ వెళ్లిన అంశంపై స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.రాహూల్ గాంధీని ప్ర‌ధాని నాయ‌క‌త్వంలో రేవంత్ రెడ్డి ప‌నిచేస్తుండ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తోంద‌ని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *