(న్యూస్ఇన్, హైదరాబాద్)
మంత్రి కొండా సురేఖ పై చర్యలు తప్పవనే సంకేతాలు క్రమశిక్షణా కమిటీ సంకేతాలు ఇచ్చింది. కొండా కూతురు సుశ్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కొండా సుష్మిత వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అత్యంత ప్రధానమని కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. పార్టీపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కల్పించకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందే అని వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాల్లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పీసీసీ చీఫ్ కు నివేదిక సమర్పించినట్లు చెప్పారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ హై కమాండ్ తో చర్చించి హై కమాండ్ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందన్నారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఈ సందర్భంగా నివేదికలో పొందుపరిచినట్లు మల్లు రవి చెప్పారు.













Leave a Reply