(న్యూస్ఇన్,హైదరాబాద్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావ్ ఆరోపించారు. సెప్టెంబర్ 7వ తేదీ నాటికి జీఓ నం. 97 రద్దు చేయకపోవడం సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. జెన్-జీ ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు సీఎం రెడీ గా ఉండాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు హరీశ్ రావు సంఘీభావం తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కళాశాల వద్దకు చేరుకున్న ఆయన, ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా అదే పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిగా విద్యార్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలిటెక్నిక్ లను ఐటీ ఐ కళశాలలో కలుపుతూ స్కిల్ యూనివర్సిటీకి అప్పగించాలని చూస్తున్నారన్నారు. స్కిల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నడిచే ఒక ప్రైవేటు సంస్థ. దానికి కేవలం మూడేళ్లు మాత్రమే ప్రభుత్వం మద్దతు ఇస్తుంది, ఆ తర్వాత పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆ యూనివర్సిటీ చట్టంలోనే స్పష్టంగా పొందుపరిచారు.రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే, అందులో 59 ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. దీని వల్ల లక్ష మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందన్నారు.రేవంత్ రెడ్డికి పిల్లల భవిష్యత్తు కన్నా పాలిటెక్నిక్ ఆస్తుల మీదే కన్ను పడింది. వేల కోట్లు విలువ కలిగిన ఆ ప్రభుత్వ భవనాలు, భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి అప్పులు తేవడానికే ఈ కుట్రలు చేస్తున్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో చదవాల్సిన పిల్లలు ప్రైవేటులోకి ఎందుకు పోవాలి? రేపు స్కిల్ యూనివర్సిటీలోకి వెళ్తే ఫీజులు పెరగవని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు.

అనుమతి అవసరం లేదు..సీఎం తెలియదా…
నేను గానీ, కేటీఆర్ గానీ కేవలం ఎమ్మెల్యేలం మాత్రమే. ఒక ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లడానికి కేంద్రానికి ఎలాంటి దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.కేవలం ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రుల హోదాలో విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలి. ఈ కనీస విషయం కూడా తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆగం చేయొద్దని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.పాలిటెక్నిక విద్యార్థులు, జీఓ నం. 97, విద్యార్థుల ఆందోళన, బీఆర్ ఎస్ మద్దతు, జీ ఓ రద్దు చేయాలి, భూములపై కుట్ర, సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావ్, తెలంగాణా ప్రభుత్వం,












Leave a Reply