(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా లో రికార్డు స్థాయిలో ఊష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం గరిష్ట ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ లో అత్యధికంగా 43.2 డిగ్రీలు నమోదు కావడం విశేషం. ఈ నెల 12 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందిన వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పొడి వాతావరణంతో వడగాడ్పులతో ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిభిక్కిరి అయ్యారు. రాబోయే కొన్ని రోజులు పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. చిన్నారులు, వృద్ధులు వేసవిని దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఉక్కపోతతో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో వేసవి తీవ్రత ఎలా ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో సోమవారం నమోదైన ఊష్ణోగ్రతలు….
నిజామాబాద్ 43.2
నల్గొండ 43.1
కామారెడ్డి 42.9
ఆదిలాబాద్ 42.8
జగిత్యాల 42.8
గద్వాల్ 42.8
ములుగు 42.8

నిర్మల్ 42.8
ఆసిఫాబాద్ 42.7
మెదక్ 42.7
నాగర్ కర్నూల్ 42.7
సిద్దిపేట 42.7
సిరిసిల్ల 42.5
సూర్యాపేట 42.5
భద్రాద్రి – కొత్తగూడెం 42.5
కరీంనగర్ 42.4
సంగారెడ్డి 42.4
వనపర్తి 42.3
హన్మకొండ 42.2
జనగాన్ 42.1
ఖమ్మం 42.1
యాదాద్రి – భువనగిరి 42










Leave a Reply