
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ఆర్టీసీలో సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. గత ఏడాది సమ్మె చేసేందుకు సిద్ధం అయిన కార్మిక సంఘాలు వివిధ కారణాలతో విరమించాయి. తాజాగా మరో సారి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 22 వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పలు డిమాండ్లను ఆర్టీసి కార్మిక సంఘాలు యాజమాన్యం ముందు ఉంచాయి. గత నెల 13వ తేదీన ఆర్టీసి కార్మిక సంఘాలు యాజమాన్యానికి నోటీసులు అందించాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సమ్మెకు సిద్ధమని ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తూ…
ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ భద్రత కల్పించేందుకు టీజీఎస్ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థలో పూర్తిగా విలీనం చేయడంతో పాటు జీతభత్యాలు, పింఛన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జీతాల సవరణలు, పటిష్టమైన పింఛను ప్రయోజనాలను తక్షణమే అమలు చేయాలన్నది ప్రదానంగా డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా ఆర్టీసి యాజమాన్యం ముందు ఉంచాయి. ఆర్టీసి కార్మికులు సమ్మె బాట పడితే రాష్ట్రంలో దాదాపు 40 వేల ఆర్టీసి బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రజా రవాణాపై దీని ప్రభావం చూపనుంది.










Leave a Reply