(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ లో ఉదయం 11 గంటలకే ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ రెండో వారం నాటికే 40 డిగ్రీలకు పైగా ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు 11 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన ఊష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.మండే ఎండలకు తోడుగా వడగాడ్పులు వీస్తుండడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే వారం,పది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నగరంలోని కొన్ని చోట్ల 42, 43 డిగ్రీల ఊష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

హిమాయత్నగర్ -40.6°C
ముషీరాబాద్- 40.6
మెట్టుగూడ- 40.6
బేగంపేట్ -40.5
మౌలాలీ -40.5
హయత్నగర్ -40.5
మలక్పేట- 40.5
ఉప్పల్- 40.4
కప్రా- 40.4
మియాపూర్ -40.4
కార్వాన్ -40.3
యూసుఫ్గూడ- 40.3
షేక్పేట- 40.2
రాజేంద్రనగర్- 40.2










Leave a Reply