(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఇప్పటి వరకు అర్బన్ మైనింగ్ మాట పెద్దగా ఎవరూ విని ఉండరు….కానీ రాబోయే రోజుల్లో ఇదో ట్రెండ్ గా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్నీ విధానంతో ఆర్బన్ మైనింగ్ ఇంటింటికి చేరనుంది. అర్బన్ మైనింగ్ గురించి కేంద్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలో మినరల్ మైనింగ్ ను వీలైనంత ఎక్కువగా చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తద్వారా విదేశాల నుంచి దిగుముతి చేసుకునే ముడిసరుకు సహా భారత ఆర్ధిక వ్యవస్థకు ఊతం దక్కుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైటెక్ సిటీలో జరిగిన క్రిటికల్ మైనింగ్ ఎక్ప్లోరింగ్ టెండర్లపై నిర్వహించిన రోడ్ షో సందర్బంగా కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.సహజ వనరుల ద్వారా వెలికి తీసే ముడి పదర్థాలను శుద్ధి చేసి బంగారం సహా విలువైన మెటల్స్ ను వెలికి తీస్తారు. ఇది సహజంగా జరిగే జరిగే ప్రక్రియ ప్రపంచలోని అన్ని దేశాలు కూడా ఈ ప్రక్రియను అమలు చేసి అంతర్జాతయ మార్కెట్ లో భారీ లాభాలను గడిస్తాయి. ఒక్కో దేశంలో లభించే సహజ వనరుల నుంచి లభ్యమయ్యే క్రిటికల్ మినరల్స్ ను ఉత్పత్తి చేస్తాయి.

మన దేశంలోని సహజవనరులను వినియోగించుని క్రిటికల్ మినరల్ ను భారీగా వెలికి తీసేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. అందులోభాగంగా కొత్తగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముడిసరుకును వెలికి తీసేందుకు బ్లాక్ లను వేలం వేసేప్రక్రియను మొదలు పెట్టింది. సహజవనరులతో వెలికి తీసే మినరల్స్ తో పాటు ఇప్పటికే వినియోగంలో ఉన్న మినరల్స్ ను రిసైకిల్ చేసే విధంగా కేంద్రం దృష్టి పెటింది. దేశంలో ఉన్న జనాభా కారణంగా అన్ని ఇళ్లలో పెరిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, కంప్యూటర్ల తయారీలో వాడే లోహాలను సేకరించేందుకు రెడీ అవుతోంది. ఈ ప్రక్రియనే అర్బన్ మైనింగ్ అనే పేరుతో ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఉపకరణాలను రీసైకిల్ చేసేందుకు సిద్ధం అవుతోంది. అర్బన్ మైనింగ్ ద్వారా పెద్ద ఎత్తున ఎలక్ట్రానికి వ్యర్ధాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఎలక్ట్రానిక్ వ్యర్ధాల ద్వారా సేకరించిన విలువైన లోహాలను తిరిగి వినియోగించుకునేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
అర్బన్ మైనింగ్ అంటే …..
అర్బన్ మైనింగ్ అంటే నగరాల్లో పడేసిన వ్యర్థాల నుంచి విలువైన లోహాలను తిరిగి సేకరించడం. ఉదాహరణకు పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలు, వైర్లు, నిర్మాణ వ్యర్థాలు వంటి వాటిలో బంగారం, వెండి, కాపర్, లిథియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి తిరిగి పొందడం ద్వారా కొత్తగా భూమిని తవ్వాల్సిన అవసరం తగ్గుతుంది.

కేంద్ర ప్రభుత్వ దృష్టి…..
దేశాన్ని ఖనిజ రంగంలో స్వయం సమృద్ధిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా:
- కీలక ఖనిజాల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం
- దేశీయ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం
- ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం
- అర్బన్ మైనింగ్ను ప్రత్యామ్నాయ వనరుగా అభివృద్ధి చేయడం
అర్బన్ మైనింగ్ మిషన్….
- ఇ-వేస్ట్ సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడం
- ఆధునిక రీసైక్లింగ్ టెక్నాలజీలను ప్రవేశపెట్టడం
- ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం
- ఉద్యోగ అవకాశాలను పెంచడం
ఎందుకు అవసరం…?
ప్రస్తుతం ప్రపంచంలో కీలక ఖనిజాలపై పోటీ తీవ్రంగా పెరిగింది. లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో:
- దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలి
- పర్యావరణ పరిరక్షణ అవసరం
- ఖర్చులను తగ్గించాలి
పర్యావరణ ప్రయోజనాలు………
సాంప్రదాయ మైనింగ్ వల్ల అడవులను కోల్పోవడం, కాలుష్యం, నీటి వనరుల తగ్గుదల వంటి దీర్థకాలిక సమస్యలు తలెత్తుతాయి. అర్బన్ మైనింగ్ వల్ల ఇలాంటి సమస్యలను పులిస్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది.
- భూమి తవ్వకాలు తగ్గుతాయి
- వ్యర్థాల నిర్వహణ మెరుగవుతుంది
- కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి
ప్రధాన సవాళ్లు……
- వ్యర్ధాల సేకరణకు వ్యవస్థ లేకపోవడం
- అవగాహన లోపం
- టెక్నాలజీ ఖర్చులు అధికంగా ఉండటం
ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం అవసరంతో చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు వ్యర్ధాల సేకరణకు వ్యవస్థ లేకపోడం, దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తక తప్పదు. కానీ ఈ రంగంలో వ్యర్ధాల సేకరణపై ప్రభుత్వ పరంగా దృష్టి పెట్టిన దాఖలాలు లేకపోవడంతో…ఇది కొత్త సమస్యలను తెరపైకి తెచ్చే అవకాశం కూడా ఉంది. వికసిత్ భారత్ లో భాగంగా కీలక మైనింగ్ ను









Leave a Reply