NewsInn

News in a Click

హైబ్రీడ్ మోడ‌ల్ – హ‌స్యాస్ప‌దం – బీజేపీ

హైబ్రీడ్ మోడ‌ల్ – హ‌స్యాస్ప‌దం – బీజేపీ

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌)

దేశంలో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం ద‌క్షిణాది రాష్ట్రాల్లో దూమారం రేపుతోంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనుస‌రిస్తున్న విధానాన్ని వ్య‌తిరేకిస్తోంది. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం ముందు కొత్త ప్ర‌తిపాద‌న‌లు ఉంచారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన విధానాల‌తో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌న్న వాద‌న బ‌లంగా వినిపించే య‌త్నం తెలంగాణా సీఎం చేశారు. అయితే బీజేపీ నేత‌లు సీఎం రేవంత్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు బ‌ట్టారు.

ఈ అంశానికి పులిస్టాప్ పెట్టేందుకు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ద‌క్ణిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. లోక్ స‌భ‌లో జ‌రిగిన ఈ చ‌ర్చ‌లో భాగ‌స్వామ్యం అయిన బెంగుళూరు ఎంపీ తేజ‌స్వీ సూర్య కాంగ్రెస్ విధానాల‌ను త‌ప్పు బ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ వాయిదా పార్టీని ఎద్దేవా చేశారు. ఏ కీల‌క అంశం అయినా వాయిదా వేయ‌డం, అడ్డుకోవ‌డం, పెండింగ్ లో ఉంచడం అనే విధానాల‌ను అవ‌లంభించి దేశానికి అన్యాయం చేసింద‌ని ఆరోపించారు.

డీలిమిటేష‌న్ విష‌యంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్ర‌తిపాద‌న‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌ధానంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి హైబ్రీడ్ మోడ‌ల్ హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. దేశంలోని పౌరులంద‌రి ఓటు విలువ ఒక్క‌టే ఉంటుంద‌ని ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఓటు విలువ ఎలా పెరుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. జీఎస్డీపీ ప్ర‌తి ఏటా మారుతుంద‌ని, ఈ ప‌ద్ధతిని అవ‌లంభిస్తే ప్ర‌తి ఏటా ద‌క్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెరుగుద‌ల‌, త‌గ్గుద‌ల ఉండాల‌ని తెలంగాణా సీఎం ప్ర‌తిపాదిస్తున్నారా అని ప్ర‌శ్నించారు. అవ‌గాహ‌న లేని ప్ర‌తిపాద‌న‌ల‌తో కాంగ్రెస్, డీఎంకే నేత‌లను ప్ర‌జ‌లను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్వించారు.

కేంద్రం తెస్తున్న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌కారం ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగ‌దని బీజేపీ నేత‌లు స్ప‌ష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్ల‌పై అమీత్ షా పార్ల‌మెంట్ లో స్ప‌ష్ట‌త ఇచ్చారు. తెలంగాణాలో ప్ర‌స్తుతం 17 పార్ల‌మెంట్ స్థానాలు 26 కు పెరుగుతుంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్త‌తుం 25 పార్లమెంట్ స్థానాల సంఖ్య 38కి పెరుగుతుంద‌ని ప్ర‌క‌టించారు.

తేజ‌స్వీ వ్యాఖ్యాల వివాదం….

కాంగ్రెస్ పార్టీ విధానాల‌ను ఎత్తి చూపుతూ పార్ల‌మెంట్ లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై ఎంపీ తేజ‌స్వీ యాదవ్ చేసిన వ్యాఖ్య‌లను కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేత‌లు త‌ప్పు బ‌ట్టారు. తెలంగాణా ఆవిర్భావాన్ని పాకిస్తాన్ తో పోల్చ‌డం బీజేపీ కి తెలంగాణాపై ఉన్న వైఖరికి నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌హా మంత్రులు బీఆర్ ఎస్ కీల‌క నేత‌లు కేటిఆర్, హ‌రీష్ రావ్ లు తేజ‌స్వీ వ్యాఖ్య‌లపై ఘాటుగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *