NewsInn

News in a Click

MI Vs PBKS మ్యాచ్ లో పంజాబ్ ఘ‌న విజ‌యం

MI Vs PBKS మ్యాచ్ లో పంజాబ్ ఘ‌న విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

పంజాబ్ కింగ్స్ ముంబాయి ఇండియ‌న్స్ పై ఘ‌న విజ‌యం సాధించింది. 7 వికెట్ల తేడాతో ముంబాయి పై గెలుపొందింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ముంబాయి ఇండియ‌న్స్ భారీ స్కోరు చేయ‌కుండా అడ్డుకుంది. 200 ప‌రుగుల లోపే జ‌ట్టును క‌ట్ట‌డి చేసింది. ముంబాయి జ‌ట్టులో డీకాక్ సెంచ‌రీ న‌మోదు చేయ‌డంతో దాదాపు 200 ప‌రుగుల వ‌ద్ద‌కు స్కోరు చేరుకుంది. 196 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన పంజాబ్ ఓపెన‌ర్లు శుభారంభాన్ని అందించారు.

ప‌వ‌ర్ ప్లే లో నే జ‌ట్టు స్కోరును పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ప్రియాన్ష్ ఆర్య‌, ప్ర‌భ్ మ‌న్ సిమ్రాన్ సింగ్ లు ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించారు. ముంబాయి బౌల‌ర్ల‌పై ముందునుంచే విరుచుకు ప‌డ్డారు.2.2 ఓవ‌ర్ల‌లో 27ప‌రుగులు సాధించారు. జోరు మీద క‌నిపించిన ప్రియ‌న్ష్ ఆర్య భారీ షాట్ అడే ప్ర‌య‌త్నం చేసి 9 బంతుల్లో 15 ప‌రుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగారు. సిమ్రాన్ త‌న జోరును కొన‌సాగిస్తుండ‌గా……కూప‌ర్ కాన్లీ క‌లిశారు. రెండో వికెట్ భాగ‌స్వామ్యానికి వీరిద్ద‌రు జ‌ట్టు స్కోరును 4.3 ఓవ‌ర్ల‌లో 45 ప‌రుగులు చేశారు. కాన్లీ 12 బాల్స్ ఎదుర్కొని 17 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ఆ త‌రువాత జ‌ట్టు శ్రేయాస్ అయ్యార్ కెప్ట‌న్ ఇన్నింగ్స్ తో మ‌రో సారి బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించారు. ఒక వైపు క్రీజులో ప్ర‌భ్ సిమ్రాన్ లు జోరుగా బ్యాటింగ్ చేశారు. ముంబాయి బౌల‌ర్ల‌పై అటాక్ మొద‌లు పెట్టి సునాయ‌స విజ‌యం అందేలా బ్యాటింగ్ చేశారు. శ్రేయ‌స్ అయ్యార్ 35 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు, 5 సిక్స్ ల‌తో 66 ప‌రుగులు చేసి184 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యారు. మ‌రో వైపు క్రీజు 11 ఫోర్లు 2 సిక్స్ ల‌తో అధ్బుత ఇన్నింగ్స్ ఆడిన సిమ్రాన్ 80 ప‌రుగుల‌తో నాటైట్ గా నిలిచారు. స్టోయినిస్ 10 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు.

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియ‌న్స్ బ్యాటింగ్ మొద‌లు పెట్టిన రెండో ఓవ‌ర్లోనే రెండు కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. రియ‌న్ రికెల్ట‌న్, డికాక్ లు ఇన్నింగ్స్ మొద‌లు పెట్టారు. డీకాక్ ముందు నుంచే అటాకింగ్ మోడ్ లో వెళ్ల‌గా రికెల్ట‌న్ ఆచి తూచి అడారు. అర్ష‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవ‌ర్లో రికెల్ట‌న్ తొలివికెట్ గా జ‌ట్టు స్కోరు 12 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యారు. ఆ త‌రువాత వ‌చ్చి రాగానే భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించి పేలవ ఫాంలో ఉన్న సూర్య కూడా ప‌రుగులేమి చేయ‌కుండానే వెనుదిరిగారు. హ్యాట్రిక్ చాన్స్ అర్ష‌దీప్ కు వ‌చ్చినా… నుమ‌న్ ధీర్ దాన్ని అడ్డుకున్నారు.

మ‌రో వైపు జోరుమీదున్న డికాక్, నుమ‌న్ ధీర్ లు ముంబాయి ఇన్నింగ్ ను చ‌క్క దిద్దారు. ప‌వ‌ర్ ప్లేలో త‌క్కువ ప‌రుగులే రాబ‌ట్టినా ఆ త‌రువాత గేరు మ‌ర్చా బ్యాటింగ్ చేయ‌డంతో ముంబాయి ఇండియ‌న్స్ భారీ స్కోరు దిశ‌గా ప‌రుగులు రాబ‌ట్టుకుంది. నుమ‌న్ ఇచ్చిన సునాయ‌స క్యాచ్ ను చాహ‌ల్ విడిచి పెట్ట‌డంతో పంజాబ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.కేవలం 31 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 3 సిక్స్ ల‌తో 50 ప‌రుగుల‌ను నుమ‌న్ చేశారు. 3వ వికెట్ రూపంలో ముంబాయి 134 ప‌రుగుల వ‌ద్ద కోల్పోయింది. 13. 4 ఓవ‌ర్ల‌లోనే ఈ స్కోరును ముంబాయి చేసింది. హ‌ర్దిక్, డికాక్ లు స్కోరు పెంచే ప్ర‌య‌త్నం చేశారు.

ముంబై ఇండియన్ బ్యాటింగ్….

హ‌ర్దిక్ కేవ‌లం 12 ప‌రుగులు మాత్ర‌మే చేసి నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగారు. 175 ప‌రుగుల వ‌ద్ద హ‌ర్ధిక ఔట్ కావ‌డంతో డీకాక్ కు రూథ‌ర్ ఫ‌ర్డ్ కేవ‌లం ఐదు బంతులు ఎదుర్కొని ఒకే ప‌రుగు చేసి అర్ష‌దీప్ బౌలింగ్ లో వెనుదిరిగారు. తిల‌క్ వ‌ర్మ కూడా వెంట‌నే రనౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ లో 60 బాల్స్ ఎదుర్కొన్న డీకాక్ 112 ప‌రుగులు చేశారు. 8 ఫోర్లు,7 సిక్స‌ల్ ల‌తో ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. మ‌యాంక్ రావ‌త్ లు నాటౌట్ గా ఉన్నారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ 3 వికెట్లు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *