NewsInn

News in a Click

మేడిగ‌డ్డ‌కు రేవంత్- జ‌గిత్యాల‌కు కేసీఆర్

మేడిగ‌డ్డ‌కు రేవంత్- జ‌గిత్యాల‌కు కేసీఆర్

(హైద‌రాబాద్, న్యూస్ఇన్)

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో సోమ‌వారం పోలిటిక‌ల్ కాక రేగ‌నుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లు ఇద్ద‌రు ఒకే రోజులు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌మ్మ‌తుల‌కు నోచుకోని కాళేశ్వ‌రం ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప‌రిశీలించనున్నారు.భూపాల ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన‌నున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి పార్టీ మారనున్న నేప‌థ్య‌లో బీఆర్ ఎస్ జ‌గిత్యాల‌లో భారీ బ‌హిరంగ స‌భ ను నిర్వ‌హిస్తోంది. దీంతో కీల‌క నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో వేస‌వి ఉక్క‌పోత‌కు తోడు రాజ‌కీయ వేడిని ర‌గిలించ‌నున్నాయి.

సీఎం మేడిగ‌డ్డ విజిట్…

ఎన్నిక‌ల‌కు ముందు కాళేశ్వ‌రం ప్రాజెక్టు కుంగిపోవ‌డంతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇదే కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధాన అస్త్రంగా మారింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించ‌క‌పోవ‌డంతోనే ఈ ప‌రిస్థితి ఎద‌రౌతుంద‌ని కాంగ్రెస్ ఆరోపించింది. బీఆర్ ఎస్ స‌ర్కార్ ఈ ప్రాజెక్టు పేరుతో లూటీ చేసింద‌న్న విమ‌ర్శ‌లు కాంగ్రెస్ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ ఇక సాధ్యం కాద‌న్న వాద‌న‌ను ఒక ద‌శ‌లో అధికార పార్టీ నేత‌లు తెర‌పైకి తెచ్చారు. తాజాగా కాంగ్రెస్ స‌ర్కార్ ఈ ప్రాజెక్టు పై త‌మ వైఖ‌రి మార్చుకున్నారు. రాజ‌కీయంగా బీఆర్ ఎస్ ను రెండున్న‌రేళ్ల‌కు పైగా టార్గెట్ చేసి దీనిపై ఓ విచార‌ణ క‌మీష‌న్ కూడా కాంగ్రెస్ స‌ర్కార్ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌త్తు చేయాల‌ని బీఆర్ ఎస్ డిమాండ్ చేసినా….. కాంగ్రెస్ ఈ ప‌థ‌కం గురించి ఏ నాడు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే….. ఈ తతంగం జ‌రుగుతుండ‌గా అనూహ్యంగా కాంగ్రెస్ స‌ర్కార్ కు కాళేశ్వ‌రం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు హ‌ఠాత్తుగా గుర్తుకు వ‌చ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ ధ‌నంతో నిర్మించిన ప్రాజెక్టును వృధాగా ఎలా ఉంచుతామ‌ని ఇటీవ‌లే వ్యాఖ్య‌లు చేశారు.. నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ సూచ‌న‌ల‌కు అనుగుణంగా మ‌ర‌మ్మ‌త్తులు చేస్తామ‌న్న సంకేతాలు ఇచ్చారు. ఇక వెంట‌నే కుంగిన మేడిగ‌డ్డ‌ను సీఎం హోదాలో ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మేడిగ‌డ్డ బ్యారేజీని సందర్శించేందుకు సోమ‌వారం ముహూర్తంగా ఖార‌రు చేశారు. ఇదే స‌మ‌యంలో రెండో విడ‌త రైతు భ‌రోసా నిధులు కూడా పెండింగ్ లో ఉంచ‌డంతో ఒక ఎక‌రాకు మించి రైతు భ‌రోసా నిధులు జ‌మ చేసేందుకు భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి విడుద‌ల చేయాల‌ని సీఎం నిర్ణ‌యం తీసుకున్నారు. మేడిగ‌డ్డ బ్యారేజీ ప‌రిశీలిన అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి భూపాల ప‌ల్లి బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు.

కేసీర్ స‌భ‌…..

ఇక ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌మైన బీఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీలోని ప‌రిణామాల‌ను త‌ట్టుకోలేక ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ ఎస్ లో చేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణా వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేత, కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. ఇలాంటి నేత కాంగ్రెస్ ను వీడి బీఆర్ ఎస్ లో చేరేందుకు ఆస‌క్తి ఉండ‌డంతో దీన్ని కాంగ్రెస్ పార్టీని ఎండగ‌ట్టేందుకు మంచి అవ‌కాశంగా బీఆర్ ఎస్ భావిస్తోంది. జీవ‌న్ రెడ్డి చేరిక‌ను సాదా సీదా స‌భ‌లా నిర్వ‌హించ‌కుండా భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించి బీఆర్ ఎస్ కు ఆద‌ర‌ణ పెరుగుతుంద‌ని నిరూపించుకునే విధంగా జ‌గిత్యాల స‌భ‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. అందులో భాగంగానే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , శాస‌న‌స‌భా ప‌క్ష డిప్య‌టీ ఫోర్ల్ లీడ‌ర్ హ‌రీష్ రావ్ లు ఇద్ద‌రు క‌లిసి స్వ‌యంగా జ‌గిత్యాల స‌భ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న జిల్లాల‌న ఉంచి భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ చేయాల‌ని పార్టీ బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పావులు క‌దుపుతోంది. మండ‌లాల వారిగా ఇంచార్జ్ ల‌ను నియ‌మించింది. ఇటీవ‌లి కాలంలో భారీ స‌భ‌ల‌ను పార్టీ నిర్వ‌హించ‌లేదు. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా బ‌హిరంగ‌స‌భ‌ల‌ను నిర్వ‌హించే అన‌వాయితీ బీఆర్ఎస్ ఎప్ప‌టి నుంచో కొన‌సాగిస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వానికి వారం రోజులు ముందుగానే స‌భ నిర్వ‌హిస్తుండ‌డంతో…. ఆవిర్భావ దినోత్స‌వం రోజు ఇక ప్ర‌తినిధుల స‌మావేశంతోనే బీఆర్ ఎస్ స‌రిపెట్ట నుంది.

పెర‌గ‌నున్న పోలిటిక‌ల్ హీట్…..

అయితే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లు ఒకే రోజు ఒకే ప్రాంతంలో ప‌ర్య‌టిస్తుండ‌డంతో…రాజ‌కీయంగా ఇద్ద‌రు నేతల ప్ర‌సంగాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌పై కేసీఆర్ నిప్పులు చెరిగే అవ‌కాశం ఉంది. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై కేసీఆర్ స్పందించ‌నున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతూ కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కాంగ్రెస్ స‌ర్కార్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రించే అవ‌కాశం ఉంది. మొత్తం మీద ఈ రెండు స‌భ‌లు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప్ర‌త్య‌క్ష పొలిటిక‌ల్ వార్ కు మ‌రోసారి తెర‌లేప‌నున్నాయి. మ‌రికొన్ని రోజుల్లో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌లు జరిపేందుకు ప్ర‌భుత్వం సిద్ధం అవుతోంది. దీంతో పార్టీ క్యాడ‌ర్ లో జోష్ పెంచనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *