(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ఉద్యమం మొదలైన నాటి నుంచి ఆ పార్టీ అధినేతపైనే అందరి దృష్టి ఉంటుంది. అధికారంలో ఉన్నా….ప్రతిపక్షంలో ఉన్నా ఉద్యమ నేతగా ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ చేసే వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం రేపుతూనే ఉంటాయి. దాదాపు ఏడాది తరువాత పార్టీ అధినేత మరోసారి బహిరంగ సభకు హాజరవుతుండడంతో తెలంగాణా ప్రజల దృష్టి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభపైనే ఉంది. మాజీ సీఏం కేసీఆర్ తో సమానమైన అనుభవం ఉన్న నేగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు ఉన్న జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సభను కాంగ్రెస్ లో కీలక నేతల కావడంతో సభను భారీ ఎత్తున నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ సభతోనే డిఫెన్స్ లోకి నెట్టాలన్న లక్ష్యంగా బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. పార్టీ ఈసభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. జగిత్యాలలో కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి కారెక్కడం రాజకీయంగా భవిష్యతుత్లో తమకు కలిసి వస్తుందని బీఆర్ ఎస్ అంచనా వేస్తోంది.

రాజకీయంగా ఇది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సభ బీఆర్ ఎస్ అంచనా వేస్తోంది. జీవన్ రెడ్డి లాంటి నేతనే కాంగ్రెస్ పార్టీని వీడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేతలు పెద్ద ఎత్తున పార్టీ వీడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాలను కాం్గరెస్ లో చేస్తుండడం కాంగ్రెస్ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారన్న వాదన ఉంది. అందుకు అనుగుణంగానే జీవన్ రెడ్డి పార్టీ వీడుతుంటే పలువురు నేతలు జీవన్ రెడ్డితో పార్టీ హై కమాండ్ చర్చించి కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని చెప్పారు. కానీ రాజకీయాల్లో జీవన్ రెడ్డి అనుభవంలో సగం ఉన్న నేతలు ఆయనను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. జీవన్ రెడ్డి లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వడం వారికి సాధ్యం కాలేదు.

ఇక పార్టీ పెద్దలు అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి క ంటే పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ తో నే భవిష్యత్తు ఉంటుందన్న అభిప్రాయంతో జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని హైదరాబాద్ లో సీఏం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. జీవన్ రెడ్డికి అన్ని హామీలు ఇచ్చినా….కేసీఆర్ తో కుమ్మక్కై పార్టీని వీడేందుకు సిద్ధం అయ్యారని సీఎం ముఖ్యనేతల సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసి… అండగా ఉంటానన్న హామీ ఇచ్చారు. జగిత్యాల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానన్నారు.అయితే పార్టీకి గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంపై నే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హై కమాండ్ సీఎం చేతిలో కీలు బొమ్మగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాళేశ్వరం పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరువు వస్తే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీనియర్ నేత బీఆర్ ఎస్ లో చేరకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు సృష్టిస్తాయన్న వాదన వినిపిస్తోంది.


ఇక సోమవారం మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల సభలో చేసే ప్రసంగంపై అందరి దృష్టి ఉంది. కేసీఆర్ ఎలాంటి అంశాలపై బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇటీవల జరిగే అసెంబల్ఈ సమావేశాల సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను అసెంబ్లీ కి రాకపోవడాన్ని తప్పు బట్టారు. పలు అంశాల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాదాపు ఎడాది కాలంగా కేసీఆర్ పై కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తున్నా… పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నా… కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలకు ఎక్కడా స్పందించలేదు. దీనికితోడు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లి సమీక్ష నిర్వహిస్తుండడం, రైతు భరోసా నిధుల కోసం సభ నిర్వహిస్తుండడంతో ఈ మొత్తం వ్యవహారంపై కేసీఆర్ తన దైన స్టైల్లో సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.
చిరిగిన జీవన్ రెడ్డి ఫ్లెక్సీలు….
బీఆర్ ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో జగిత్యాల గులాబీ మయం అయింది. గులాబీ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణం గులాబీ జెండాలతో నిండిపోయింది. అయితే జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జీవన్ రెడ్డి ఫోటోతో ఏర్పాటు చేసిన ఫెక్సీలను మాత్రమే చింపి వేయడం కలకలం రేపింది. గులాబీ నేతలు ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.











Leave a Reply