NewsInn

News in a Click

పిల్లి శాప‌నార్ధాల‌కు ఉట్టి తెగుతుందా…. కేసీఆర్

పిల్లి శాప‌నార్ధాల‌కు ఉట్టి తెగుతుందా…. కేసీఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

జ‌గిత్యాల స‌భ‌లో మాజీ సీఎం కేసీఆర్ త‌న స్టైల్లో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో రెండున్న‌రేళ్ల ప్ర‌భుత్వ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే ప‌ని కూ ఒక్క‌టి కూడా లేద‌న్నారు. కూల్చి వేత‌లు, కాల్చి వేత‌లు, పోలీసుల దాడులే కొనసాగుతున్నాయ‌న్నారు. త‌న చావును కోరుకుంటున్న వారి గురించి గురించి పిల్లి శాప‌నార్ధాల‌కు ఉట్టి తెగుతుందా అనే సామెత ను గుర్తు చేశారు. రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది గులాబీ పార్టే అని ధీమా వ్య‌క్తం చేశారు. జ‌గిత్యాల లో నిర్వ‌హించిన ప్ర‌జా ఆశిర్వాద స‌భ‌లో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి తో పాటు ఆయ‌న అనుచ‌రులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు.మీటర్లు పెట్టకపోతే 30 వేల కోట్లు కట్ చేస్తానని మోదీ అన్నాడని.. కట్ చేశాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 30 వేల కోట్ల ఆదాయాన్ని వదులుకుని కూడా తెలంగాణలో కరెంటు మీటర్లు పెట్టనివ్వలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లి కరెంటు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. అప్పటి రూ.30వేల కోట్లు తీసుకుని.. వ్యవసాయ కరెంటు మీటర్లకు మోటర్లు పెట్టేందుకు సంతకం పెట్టారని పేర్కొన్నారు. తొందరలోనే రాష్ట్రంలోని వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు వస్తాయని తెలిపారు.

కాంగ్రెసోళ్లు పెన్షన్లు పెంచుతామని ఎగ్గొట్టారని అన్నారు. అదొక్కటే కాదని.. ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు మహాలక్ష్మీ అని రూ.2500 ఇస్తామని చెప్పారని.. ఇచ్చారా అని ప్రశ్నించారు. స్కూటీలు ఇచ్చారా అని అడిగారు. అలా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో ఏం జరుగుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణ యజ్నం ప్రారంభం కావాల్సిందేనని స్పష్టం చేశారు. దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పోరాటం చేయాల్సిందేనని.. వాళ్లను నిలదీయాల్సిందే న‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందేనని స్పష్టం చేశారు.

జీవ‌న్ రెడ్డితో సుదీర్ఘ అనుభ‌వం ఉంది……

జీవ‌న్ రెడ్డి గురించి నేను ఎక్కువ చెబితే మేమే డ‌బ్బా కొట్టుకున్న‌ట్లు ఉంటుంది. జ‌గిత్యాల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయ‌న నాకంటే పెద్ద అయినా…ఎంతో గుండె ధైర్యం ఉన్న నాయ‌కుడ‌న్నారు.
ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోయిన పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన్ని ఈ ప్రాంత ప్రజలు గెలిపించారని కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డికి పదవులు కొత్త కాద‌ని, ఆయ‌న‌ను ఇక్క‌డికే ప‌రిమితం చేయ‌మ‌ని రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు తెలంగాణాలోపార్టీ బ‌లోపేతం కోసం ఆయ‌న సేవ‌లు వాడుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే సారి ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా బీఆర్ ఎస్ అధికారంలోకి రాబోతుంద‌న్నారు. అప్పుడు జీవ‌న్ రెడ్డికి మ‌రింత ఉన్న‌త ప‌ద‌వి క‌ట్ట‌బెడుతామ‌ని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ స‌భ పెట్టింది……

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆర్ధిక ప‌రిస్తితి ధారుణంగా మారింద‌న్నారు. జ‌గిత్యాల‌లో తాను స‌భ పెడితే కాంగ్రెస్ అక్క‌డ పెట్టుకుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర నిధులు లేక చిప్ప ప‌ట్టుకుని తిరిగే ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు. రైతు బంధు నిధులు నెల‌కోసారి వేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

హైడ్రా…నీడ్రా….జీడ్రా…….

హైద‌రాబాద్ లో హైడ్రా తెచ్చి పేద‌ల ఇళ్లు కూలుస్తున్నార‌ని మూసీ అభివృద్ధికి తాము వ్య‌తిరేకం కాద‌న్నారు. హైడ్రా మాదిరిగానే నిజామాబాద‌లో నీడ్రా, జ‌గిత్యాల‌లో జీడ్రా తెస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నార‌ని, తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే హైడ్రాను ఎత్తి వేస్తామ‌ని కేసీఆర్ అన్నారు. దాదాపు 50 నిమిషాల పాటు కేసీఆర్ ఈ స‌మావేశంలో ప్ర‌సంగించినా ఒక్క సారి కూడా సీఎం రేవంత్ పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *