
(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాష్ట్రంలో ఒకే రోజు కీలక స్థానాల్లో ఉన్న అధికారులు ఒకే రోజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నారాయణపేట ఆర్డీఓ రాంచందర్ నాయక్ 25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్ గా పట్టు బడ్డారు. మరో ఘటనలో వికారాబాద్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, ఎస్ఐ కుటుంబ గొడవల నేపథ్యంలో ఇర్షాద్ అనే వ్యక్తిపై, ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన సీఐ, ఎస్ఐ లు.

ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రూ.60,000 లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్ అధికారులు రూ.40,000 లంచం ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. రూ.20,000 సీఐకి, ఎస్ఐకి బాధితుడు ఇచ్చారు.మిగతా రూ.20,000 విషయంలో బాధితుడు ఇర్షాద్ సమాచారం ఇవ్వడంతో సీఐ సరోజ, ఎస్ఐ రాణితో సహా మరో ముగ్గురిని ఆధారాలతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.







Leave a Reply