NewsInn

News in a Click

ఘోష్ నివేదిక‌ను కోర్టు త‌ప్పుప‌ట్ట‌లేదు – ఎంపీ చామ‌ల‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

పీసీ ఘోష్ క‌మిష‌న్ నివేదిక‌పై హై కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఘోష్ క‌మిష‌న్ రిపోర్ట‌ను కోర్టు త‌ప్పు ప‌ట్ట‌లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. రిపోర్ట్ లో చిన్న చిన్న అంశ‌ల‌ను స‌రిచేసకోవాల‌ని కోర్టు సూచించింద‌న్నారు. దీనికి బీఆర్ ఎస్ నేత‌లు సంబ‌రాలు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. పీసీ ఘోష్ క‌మిష‌న్ ఆధారంగా ప్ర‌భుత్వం సీబీఐ విచార‌ణ అడ‌గ‌లేద‌న్నారు. కోర్టు తీర్పుతో ఇక బీజేపీ నేత‌ల నైజం కూడా బ‌య‌ట ప‌డ‌నుంద‌న్నారు. దోషుల‌పై చ‌ర్య‌లు తీసుకునే విధంగా కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజయ్ ల మీద బాధ్య‌త పెరిగింద‌న్నారు. హై కోర్టు ఆదేశాలు పరిశీలించిన త‌రువాత న్యాయనిపుణులతో చర్చించి సాయంత్రం మా అభిప్రాయాన్ని తెలియ‌చేస్తామ‌న్నారు. రాష్ట్ర ఖజానాకు జరిగిన అన్యాయంపై మేము వెనకడుగు వేయమ‌ని చెప్పారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక్కటే కాదు విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, ఎన్డీ ఎస్ ఏ రిపోర్ట్ ఉందని మరిచిపోవద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *