
(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె వెనుక మాజీ మంత్రి హరీష్ రావ్ కుట్ర ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. చర్చలు జరుగుతుండగా కార్మిక సంఘాలు ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ వెళ్లి పోయారన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మిగిలిన మూడు అంశాలపై చర్చిస్తున్నామన్నారు. ఆర్టీసి ఆదుకునే లక్ష్యంగా ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్లు తెలిపారు. ఆర్టీసి కార్మికుల సమ్మెపై మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం..1134 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం ,యూనియన్ ల అంశాలపై ప్రభుత్వం పరిగణన లో ఉందన్నారు. నిరసనలు చేసే వారు బస్ డిపోలలో చేసుకోవాలన్నారు. కొనసాగుతున్న ఆర్టీసి సమ్మె….
ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆర్టీసి ఉద్యోగులను హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కి పోతున్నారని అధికారులు ఊహించలేదన్నారు.డిప్యూటీ సీఎం చెన్నై లో ఉండడం వల్ల ఆర్ధిక అంశాలపై చర్చలు జరుపలేకపోతున్నామన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం….
ఆర్టీసి సమ్మె కారణంగా ప్రజలకు తలెత్తే సమస్యలను కూడా ప్రత్యేకంగా దృష్టి సారించామని, ప్రైవేటు బస్సుల ను నడిపిస్తూనే నగరంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసి కార్మికులు విధుల్లో చేరాలని పొన్నం ప్రభాకర్ కోరారు.





Leave a Reply