NewsInn

News in a Click

అంత్య పుష్కరాలకు గవర్నర్‌కు ఆహ్వానం

(హైదరాబాద్,న్యూస్ఇన్‌)

దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ ఎన్‌. హనుమంతరావు లు బుధవారం లోక్‌ భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లాను కలిశారు.రానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలు (జూన్‌ 26 నుంచి జూలై 7, 2027 వరకు), సరస్వతి అంత్య పుష్కరాలు (మే 21 నుంచి జూన్‌ 1, 2026 వరకు) నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గవర్నర్‌కు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్‌ తెలిపారు.భక్తుల వసతి సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యలు, ముఖ్య ఆలయాలు–వాటి ప్రాధాన్యత, శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై గవర్నర్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *