
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆర్టీసి కార్మికులు చేపట్టిన సమ్మె మూడు రోజులకు ముగిసింది. ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్క సారిగా మారి పోయాయి. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించింది. మంత్రి వర్గ సమావేశంలో కూడా ఆర్టీసి సమస్యలపై చర్చించి సానుకూలంగా స్పందించింది. దీంతో శుక్రవారం ఉదయం చర్చలకు రావాలని ఆర్టీసి కార్మిక సంఘాలను కోరింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 12 గంటల పాటు దశల వారిగా ఆర్టీసి కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగాయి. తొలి విడతలో అధికారులతో చర్చలు జరిగిన అనంతరం మధ్యాహ్నం మంత్రులతో ఆర్టీసి కార్మిక సంఘాలు చర్చలు మొదలు పెట్టాయి. కార్మిక సంఘాలు 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. ఆర్ధిక పరమైన అంశాలు మినహా అన్ని అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముందుగానే అమాత్యులు ప్రకటించారు. ఈ చర్చల్లో ఆర్ధిక అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కాసేట్లో అమాత్యులు, ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు సమ్మె విరమిస్తూ అధికారిక ప్రకటన చేయనున్నారు.






Leave a Reply