(హైదరాబాద్,న్యూస్ఇన్)
మాజీ సీఏం కేసీఆర్ ఇప్పుడు మనిషి కాదని, మరమనిషి అని కల్వకుంట్ల కవిత అన్నారు. గుంట నక్కలు, తోడేళ్ల మధ్య చిక్కుకుని ఆత్మ లేని మరమనిషిగా మారి పోయారని కవిత వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని తాను అనుకోలేదన్నారు.జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తే…తనను తప్పుబట్టి పార్టీ నుంచి బయటకు పంపారని వాపోయారు. ఉద్యమంలో ఉన్న తన తండ్రి కేసీఆర్ కు ఇప్పటి కేసీఆర్ కు ఎంతో మార్పు వచ్చిందన్నారు. మరమనిషిగా మారిన ఆయన కొంత మంది చేతిలో బంధీగా మారరని ఆరోపించారు.తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు సందర్భంగా కవిత బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను ఎక్కువగా టార్గెట్ చేశారు.
కేసీఆర్ గురించి తాను ఈ విధంగా బాధతో స్పందిచాల్సి వచ్చిందన్నారు. పాత కేసీఆరే అయితే ప్రజా సమస్యలపై స్పందించి ప్రజాక్షేత్రంలో పర్యటించే వారన్నారు.

ఆనాడు చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటూనే భిక్షాటన చేసి చేనేత కార్మికును ఆదుకున్న విషయాన్ని కవిత గుర్తు చేశారు. పెద్ద సారు బయటకు రారు….చిన్నసారు పట్టించుకోరంటూ అన్న కేటిఆర్ కు చురుకలు అంటించారు. పెద్ద సారు కేసీఆర్ ఫాం హౌస్ కు పరిమితం చేసి చిన్న సారు ను సీ ఎం కావాలనుకుంటున్నారని కవిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రలో కర్కోటక పాలన జరుగుతున్నా పట్టించుకోకపోవడం వెనుక కారణమేమిటని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి గురించి మాట్లాడితే చర్యలు తీసుకున్న కేసీఆర్ అవినీతి చేసిన వారిని తన పక్కనే ఉంచుకున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం వెలుగు మట్లలో అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారి ఇళ్లు కూల గొట్టినా ప్రధాన ప్రతిపక్షం పెద్దగా స్పందించలేదన్నారు. కుమ్మెరలో 2 నెలల బాలిక హత్య జరిగినా నేటి వరకు కేసునమోదు చేయలేదన్నారు. వెలుగుమట్లలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఓ గర్భిణీ గర్భస్రావానికి కారణమైందని, ఆ మహిళ తండ్రి ఆవేదన తన చెవుల్లో ఇంకా వినిపిస్తోందన్నారు. ఈ కారణంగానే సీఎం రేవంత్ రెడ్డి ని కర్కోటకుడు అని అంటున్నానని చెప్పారు. పేదల గురించి ఏ మాత్రం ఈ సీఎం కు కనికరం లేదన్నారు.
ఇక బీజేపీ విషయానికి ఆ పార్టీకి 8 మంది ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్క నాడు గళం విప్పిన పరిస్థితి లేదన్నారు. బీసీ బిల్లు ఇక్కడ నుంచి పంపినా కేంద్రం నుంచి తిరిగి రాలేదన్నారు.మహిళా బిల్లును పెద్ద డ్రామా చేసి పెట్టినా బిల్లును కుట్రతో ఆమోదం పొందడంలో విఫలమైందన్నారు. బీజేపీ ఎంపీలు బానిస ఎంపీలుగామారి పోయారన్నారు. సామాజిక న్యాయం కోసం ఆ పార్టీ ఎప్పుడూ,ఎక్కడా ప్రయత్నించిన పరిస్థితి లేదన్నారు.బీజేపీ తెలంగాణా ఏర్పాటు ను ముందు నుంచి వ్యతిరేకిస్తుందన్నారు. తెలంగాణా ప్రయోజనాలపై బీజేపీ ఎంపీలు మౌనంగా ఉంటున్నారన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ సహా ఇంకా నేతలు తప్పు బట్టడం విడ్డూరంగా ఉందన్నారు.










Leave a Reply