NewsInn

News in a Click

అమ్మ‌గా ఉంటా….అంద‌రినీ ఆద‌రిస్తా….!

అమ్మ‌గా ఉంటా….అంద‌రినీ ఆద‌రిస్తా….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అమ్మ‌గా ఉంటూ అంద‌రినీ ఆద‌రిస్తాన‌ని టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌కురాలు క‌విత ప్ర‌క‌టంచారు.రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీ ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించి ప‌లు జెండా, ఎజెండాను ప్ర‌క‌టించారు. తెలంగాణా జాగృతి రంగుల‌తోనే పార్టీ జెండా ను రూపొందించారు. ఉద‌యం 10 గంట‌ల ప్రాంతంలో స‌భా ప్రాంగ‌ణానికి వ‌చ్చిన ఆమె ముందుగా అమ‌ర‌వీరు స్థూపం, ప్రొ.జ‌య‌శంక‌ర్ విగ్ర‌హం, తెలంగాణా త‌ల్లి విగ్ర‌హానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం పార్టీ పేరు గురించి ….కొద్దిసేపు స‌స్పెన్స్ కొన‌సాగించారు. తెలంగానా జాగృతికి అనుబంధంగానే పేరు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగినా…… అనూహ్యంగా కొత్త పేరును క‌విత ప్ర‌క‌టంచారు. తెలంగాణా రాష్ట్ర స‌మితి మాదిరిగానే–తెలంగాణా రాష్ట్ర సేన గా పేరు ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కార్య‌క‌ర్త‌లు పెద్దఎత్తున క‌విత సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.

పార్టీ పేరునుప్ర‌క‌టించిన అనంత‌రం 10.15 నిమిషాల‌కు త‌న ప్ర‌సంగాన్ని మొద‌లు పెట్టి దాదాపు 45 నిమిషాలు ప్ర‌సంగం చేశారు. క‌విత ప్ర‌సంగంలో ప్ర‌ధానంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ ఎస్ అభివృద్ధికి తాను క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెప్పారు. కాని ప‌రిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారి పోయాయ‌ని చెప్పారు. ఈ ప‌రిణామాల‌పై తాను ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు ప్ర‌కటించారు. ఇది క్ష‌మాప‌ణ‌ల‌తో నే పూర్తి కార‌ద‌ని, తెలంగాణా ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం పోరాటం చేసేందుకు తాను తెలంగాణా ప్ర‌జ‌ల‌కు అమ్మ‌లాగా ఆదుకునేందుకు పార్టీ ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. అమ్మ ఎప్పుడూ జేబులు చూడ‌ద‌ని…అమ్మ పిల్ల‌ల క‌డుపును చూస్తుంద‌న్నారు.తాను కూడా మీ బాగోగులు చూసేందుకు రాజ‌కీయ శ‌క్తిగా మారాల‌న్న ల‌క్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణా రాష్ట్ర సేన రాష్ట్రంలోప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు…..రెండేళ్ల వ‌ర‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉంటూ ఆ త‌రువాత అధికార పార్టీగా అవ‌తరించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

రేవంత్ క‌ర్కోట‌కుడు….కేసీఆర్ మన మ‌నిషి కాదు….. మారిన మ‌ర‌ మ‌నిషి…..

తెలంగాణా ఉద్య‌మకారుల‌కు బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్నారు. ఉద్య‌మ కారులకు ప‌దేళ్ల ప్ర‌భుత్వంలో గుర్తింపు కూడా ద‌క్క‌లేద‌న్నారు. ప్ర‌భుత్వం త‌ర‌పున ఉద్య‌మ‌కారుల‌ను గుర్తిస్తే క‌నీసం 30 వేల మంది కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వులు వ‌చ్చేవ‌న్నారు. బీఆర్ ఎస్ హాయంలో రెండు కీల‌క సాగునీటి ప‌థ‌కాలు పూర్తి చేయ‌డంలో నిర్ల‌క్ష్యం చేసింద‌ని విమ‌ర్శించారు. పాల‌మూరు ప‌థ‌కాన్ని పూర్తి చేయ‌లేద‌ని, దాదాపు ల‌క్ష కోట్ల రుపాయాల‌ను వెచ్చించి ల‌క్షెక‌రాల‌కు మాత్ర‌మే సాగునీటిని అందించింద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *