(హైదరాబాద్,న్యూస్ఇన్)
కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన హై స్పీడ్ రైల్వే కారిడార్ లో చేపట్టాల్సిన పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి మూడు హై స్పీడ్ రైళ్లను నడిపించాలని నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ – పూణే – ముంబై
భారత్ ఫ్యూచర్ సిటీ – చెన్నై
భారత్ ఫ్యూచర్ సిటీ – బెంగళూరు హై స్పీడ్ కారిడార్ల ను ఏర్పాటు చేయనుంది.
వీటిలో హైదరాబాద్-పుణే-ముంబాయి కారిడార్ పై డీపీఆర్ రెడీ అయింది. మిగిలిన రెండు రూట్లపై కూడా చర్చలు జరుపుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. సమీక్షలో ఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్,ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య,ఆర్ అండ్ బి ఈఎన్సి లు మోహన్ నాయక్, జయ భారతి, రైల్వే , NHSRCL అధికారులు,HMDA,MAUD,HMRL అధికారులు తదితరులు. పాల్గొన్నారు. అంతర్జాతీయ విమనాశ్రాయానికి సమీపంలోనే హైస్పీడ్ రైల్ కారిడర్ కు స్థలం కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.













Leave a Reply