NewsInn

News in a Click

డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ హ‌ఠాన్మ‌ర‌ణం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఉపముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో మరణించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక బాధ్యతలను గతంలో ఆయన నిర్వహించారు. విధి నిర్వహణలో నికార్సైన పాత్రికేయుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం చాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స నిర్వహిస్తున్న సమయంలో మరో మారు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మ‌ధు మృతి చెందారు. మారబోయిన మధుసూదన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌లు త‌మ సంతాపాన్ని తెలియ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *