(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మోయినాబాద్ డ్రగ్స్ కేసు లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బేయిల్ లభించింది. 45 రోజుల తరువాత బేయిల్ మంజూరు చేసింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈగల్ టీం చేపట్టిన ఈ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. మొయినాబాద్ శివారుల్లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో వరుసగా వీకెండ్ పార్టీలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు నిఘా వేశారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ తో పాటు బెంగుళూరు కు చెందిన వ్యాపారులు కూడా పార్టీకి అటెండ్ అయ్యారన్న సమాచారంతో ఈగల్ టీం ఫాం హౌస్ పై రైడ్ చేసింది. ఈ సమయంలో పైలెట్ రోహిత్ రెడ్డి మిత్రడు ఢిల్లీకి చెందిన వ్యాపారి నమీత్ మిశ్రా గాలిలోకి కాల్పులు జరుపడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని డ్రగ్స్ టెస్టులు చేయించి సోదాలు చేయడంతో అక్కడ డ్రగ్స్ పోలీసులకు పట్టబడ్డాయి. ఈ కేసులో 11 మందిని మొత్తం పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. పుట్టా మహేష్ సహాయం మరో 7 గురికి స్టేషన్ బేయిల్ మంజూరు చేసి ఆ మరుసటి రోజే విడుదల చేశారు. కానీ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమీత్ మిష్రాలను మాత్రం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరిపై డ్రగ్స్ తో పాటు గాలి లోకి కాల్పులు జరుపడంతో పలు ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అనంతరం వీరిని విచారణ కోసం పలు మార్లు కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
చంచల్ గూడ్ జైల్లో ఉన్న ఈ ముగ్గురు బేయిల్ కోసం అప్పటి నుంచి వారి న్యాయ వాదులు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పడు ఫలించాయి. ఈ కేసులో తొలివిడతగా పైలెట్ రోహిత్ రెడ్డికి మాత్రమే కోర్టు బేయిల్ మంజూరు చేసింది.











Leave a Reply