
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుల సంస్థ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అలెర్ట్ ను ప్రయోగత్మకంగా పరిశీలించింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఫోన్లకు ఈ అలర్ట్ రెండు సార్లు వచ్చింది. ఉదయం 11.50 గంటలకు ఒక సారి మరో 15 నిమిషాల తరువాత మరోసారి అలెర్ట్ సైరన్ ఫోన్లలో వచ్చింది.
స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లపై అలెర్ట్ మెసెజ్ తో పాటు…సైరన్ కూడా వినిపించింది. దాదా 30 సెకన్ల పాటు ఈ సైరన్ మోగింది. ఫోన్ స్క్రీన్ పై మెసెజ్ కూడా అలెర్ట్ మెసేజ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిన్ననే ఇందుకు సంబంధించి అప్రమత్తం చేయడంతో….ఎంతో మంది ఫోన్ వినియోగదారులు ఈ అలెర్ట్ సైరన్ తో ఎలాంటి ఆందోళన చెందలేదు. అయితే కొంత మంది మాత్రం ఫోన్ అలెర్ట్ ఆందోళన వ్యక్తం చేసినా ఆ తరువాత విషయం తెలసుకుని ఊపిరి పీల్చుకున్నారు.







Leave a Reply