NewsInn

News in a Click

వివాదాలు అధిగ‌మించి’థ‌ళ‌ప‌తి’కి ద‌క్కిన విజ‌యం

వివాదాలు అధిగ‌మించి’థ‌ళ‌ప‌తి’కి ద‌క్కిన విజ‌యం

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

త‌మిళ రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసిన విజ‌య్ థ‌ళ‌ప‌తికి పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి చిక్కులు మొద‌ల‌య్యాయి. ఆ చిక్కుల‌ను తొల‌గించుకునే అనుభ‌వం కూడా విజ‌య కు రాజ‌కీయంగా లేదు. ఈ కార‌ణంగా అవి జాతీయ స్థాయిలో కూడా వివాదాస్ప‌దంగా మార‌డంతో పాటు విజ‌య్ పార్టీపై ప్రభావితం చూపాయి. పార్టీ ఆవిర్భావ సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస లాట జాతీయ రాజ‌కీయాల్లోనే దూమారం రేపింది. క‌రూర్ లో టీవీకే పార్టీ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ ద‌గ్గ‌ర భారీ జ‌న‌స‌మీక‌ర‌ణ‌తో జ‌రిగిన తొక్కిస లాటలో 36 మంది స్పాట్ లో చ‌నిపోగా…మ‌రో ఐదుగురు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. దీంతో ఈ ఘ‌ట‌న‌లో 40 మందికి పైగా మృతి చెంద‌డం రాజ‌కీయాల్లోనే తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ కార‌ణంగానే ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు రాజ‌కీయ పార్టీల స‌భ‌ల ఏర్పాటుపై కూడా నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ వ్య‌వ‌హారం జాతీయ స్థాయిలో దూమారం రేప‌డంతో ఈ ఘ‌ట‌న‌కు విజ‌య థ‌ళ‌ప‌తిని బాద్యుడిని చేస్తూ ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ద‌ర్యాప్తు సంస్థ‌లు ఈకేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ చేసిన ప్ర‌య‌త్నాలు విజ‌య్ థ‌ళ‌ప‌తికి రాజ‌కీయంగా క‌లిసి వ‌చ్చాయి.పార్టీ ఏర్పాటుకు ముందు కూడా ప‌లు వివాదాలు ఆయ‌న చుట్టు ముట్టాయి. రాజ‌కీయ కోణంలో ఆయ‌న న‌టించిన సినిమాలు జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీశాయి. మెర‌స‌ల్, స‌ర్కార్ సినిమాలు తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. ఆ సినిమాల్లో కొన్ని సీన్ల‌ను తొల‌గించాల‌ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి.

ఆ త‌రువాత రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేయ‌డం…రాజ‌కీయంగా బ‌ల‌ప‌డుతున్న సంకేతాలు వ‌స్తుండ‌డంతో రాజ‌కీయ పార్టీలు విజ‌య్ ను టార్గెట్ చేశాయి.అధికార పార్టీలు వ్య‌వ‌హ‌రించిన తీరు విజ‌య్ కు ప్ర‌జాక్షేత్రంలో బాగా క‌లిసి వ‌చ్చింది. ఎన్నిక‌ల‌కు నాలుగైదు నెల‌ల ముందు జ‌న‌నాయ‌గ‌న్ సినిమా విడుద‌ల‌కు విజ‌య్ చేసిన ప్ర‌య‌త్నాలు విజ‌యవంతం కాక‌పోవ‌డం..పైగా సినిమా చుట్టూ వివాదాలు విడుద‌ల కు ముందే వివాదం రేగ‌డం, విజ‌య్ స‌తీమ‌ణి వ్య‌వ‌హారం రాజ‌కీయంగా దూమారం రేపింది. వీటిపై విజ‌య్ ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా… హుందాగా ప్ర‌జ‌ల ముందుకు కొన్ని విష‌యాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఈ వివాదాలు ఎందుకు తెర‌పైకి వ‌చ్చాయో మీరు ఆలోచించండి అనే వ్యాఖ్య‌లు మాత్ర‌మే చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌తో విజ‌య్ రాజ‌కీయ వేదింపులు అని చెప్ప‌క‌నే త‌న అభిప్రాయాన్ని ఓట‌ర్ల ద‌గ్గర‌కు తీసుకెల్ల‌డంలో విజ‌య‌వంతం అయ్యారు. ఈ వివాదాల‌న్నీ…. ప్ర‌జ‌ల్లో విజ‌య్ థ‌ళ‌ప‌తికి సానుభూతి తెచ్చేలా చేసింది. యువ‌త మ‌ద్ద‌తు కూడ గ‌ట్ట‌డంలో విజ‌య‌వంతం కావ‌డం. సానుభూతి, ప్రభుత్వ వ్య‌తిరేక‌త అన్నీ క‌లిపి విజ‌య్ థళ‌ప‌తిని అధికార పీఠం వేపు తీసుకెళ్లాయి.

త‌మిళ రాజ‌కీయాల్లో మార్పు తెచ్చిన విజ‌య్ థ‌ళ‌ప‌తి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *