(చెన్నై,న్యూస్ఇన్)
అతి తక్కువ అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు విజయం దక్కించుకున్నాయి. అధికారం కొనసాగించేందుకు ప్రజల మద్దతుగా నిలిచారు. ఎన్డీఏ విజయానికి సీఎం రంగస్వామి పాత్ర కూడా కీలకం. రంగస్వామికి ఉన్న క్లీన్ ఇమేజ్, ఆయన సాధారణ జీవితం ప్రజలకు ఎన్డీఏ అభ్యర్థులను మరింత చేరువ చేశాయి.ఆయనది సింపుల్ లైఫ్స్టైల్. తురచూ బైక్పై ప్రయణిస్తుంటారు. విద్యార్థులకు ఉదయం పూట రొట్టె, పాలు అందించే పథకం, సీనియర్ల సిటిజన్లకు పింఛన్ పెంపు, రైతులకు పథకాలు, విపత్తు సమయంలో సహాయం అందించడంతో జనంలో పేరొందారు.

గ్రామీణ ఓటర్లతో ఆయనకు బలమైన బంధం కూడా ఉంది. 1990లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రంగసామి మంత్రిగా, అత్యధికంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈ విజయంతో ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. పలుమార్లు కీలక పదవులు చేపట్టడం, ప్రజల్లో ఉన్న ఇమేజ్ కారణంగా ఎన్డీఏ సర్కార్ విజయం సాధించింది. ఎన్నికల సమయంలో నిర్వహించిన సర్వేలో కూడా 62-68శాతం మంది ఓటర్లు రంగస్వామి సీఎంగా ఉండాలని కోరుకున్నారు.

కూటమిపై టీవీకే ఎఫెక్ట్….
పుదుచ్చేరిలో ఇండియా కూటమికి ఓటమి తప్పించుకోలేకపోయింది. ఇండియా కూటమిలోని విభేదాలు
ఎన్డీఏ అనుకూలంగా మారాయి. ఇండియా కూటమికిి రంగ స్థాయి ఇమేజ్ ను తట్టుకుని నిలబడే స్థాయిలో నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న వి.నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. ఈ ఎన్నికల్లో విజయ్కు చెందిన టీవీకే పోటీ చేయడం కూడా ఇండియా కూటమికి ప్రతికూలం మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీవీకే వైపు కూడా వెళ్లడంతో ఇండియా కూటమిపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తమిళనాడులో జాతీయ పార్టీలను దెబ్బ కొట్టిన టీవీకే పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమికి పులిస్టాప్ పెట్టింది. పుదుచ్చేరి రెండు స్థానాలతో తమ ఖాతాను టీవీకే తెరిచింది.
పార్టీల వారిగా సీట్లు…..
ఎన్.ఆర్ కాంగ్రెస్ -12, డీఎంకే-5, బీజేపీ-4, టీవీకే-2, కాంగ్రెస్-1,స్వతంత్ర-3, సహా ఇతర పార్టీలో ఒక్కో స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏ పక్షాలకు దాటడంతో మరోసారి రంగస్వామి సీఎం అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది.









Leave a Reply