NewsInn

News in a Click

బండి భ‌గీర‌థ్ విష‌యంలో బీఆర్ఎస్ ది త‌ప్పు

బండి భ‌గీర‌థ్ విష‌యంలో బీఆర్ఎస్ ది త‌ప్పు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

బండి భ‌గీర‌థ్ విష‌యంలో బీఆర్ఎస్ త‌ప్పుడు విధానాల‌ను అవ‌లంభించింద‌ని టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు క‌విత ఆరోపించారు.దాదాపు వారం రోజులుగా రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయంశంగా మారిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్ త‌న‌యుడు బండి భ‌గీర‌థ్ విష‌యంలో టీఆర్ ఎస్ అధ్య‌క్షురాలు క‌విత స్పందించారు. త‌మ మ‌ద్ద‌తు మ‌హిళ‌ల‌కు ఉంటుంద‌ని చెప్పిన క‌విత‌….ఈ కేసు లో బీఆర్ఎస్ అనుస‌రిస్తున్న విధానాన్ని తప్పు బ‌ట్టారు. బీఆర్ ఎస్ నేత‌లు మైన‌ర్ బాలిక హ‌క్కులు కాపాడే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని నిల‌దీశారు. బీఆర్ ఎస్ కార‌ణంగానే ఆ బాలిక ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని ఆరోపించారు. బాధితురాలి ఫోటోలు బ‌య‌ట‌పెట్టిన వారిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. బండి సంజ‌య్ త‌న‌యుడిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చ‌యాని, ఈ స‌మ‌యంలోనే ప్ర‌ధాని మోడీ , ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో క‌లిసి సంజ‌య్ వేదిక పంచుకోవ‌డం శోచ‌న‌యం అన్నారు. బీజేపీ నేత‌లు త‌మ కుటుంబ స‌భ్యుల‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా…ముందుగా దేశం దాటిస్తార‌ని ఆ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకోవాలంటే భ‌గీర‌థ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఒక ఆడ‌పిల్ల వ్య‌వ‌హారం కావ‌డంతోనే సంయ‌నంతో వ్య‌వ‌హ‌రించాల్సి వ‌స్తుంద‌ని క‌విత అన్నారు.

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌పై మౌన‌మేల‌…

మోడీ పొదుపు మంత్రాలు తెలంగాణాలో చెప్పి వెళ్లారని,పొరుగు రాష్ట్రానికి మాత్ర‌మే కేంద్రం నిధులు ఇస్తోంద‌ని క‌విత ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిస్థితే ఉన్న అప్పర్ భద్రకు మాత్రం జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణాకు జ‌రుగుతున్న‌ అన్యాయంపై ముఖ్యమంత్రి మాట్లాడాలని డిమాండ్ చేశారు. సాగునీటి విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం స‌ద్వినియోగం చేసుకునే య‌త్నం చేస్తుంటే తెలంగాణా సీఎం పాల‌మూరు ప్రాజెక్టు గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ కనీసం ఒక్క ప్రశ్న కూడా ఎందుకు అడగలేదని క‌విత నిల‌దీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *