
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 23న ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వేద పాఠశాల శంకుస్థాపన, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి వేదాశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద, ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అత్యంత వైభవంగా జరగనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు.
.








Leave a Reply