(హైదరాబాద్,న్యూస్ఇన్)
మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ముదిరింది. ఇటీవల కడియం శ్రీహారి దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించడాన్ని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి మూడు పేజీల లేఖతో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కొండా సురేఖ భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ఈ వ్యవహారంపై మంత్రి చర్చించారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా స్పందించడం హాట్ హాట్ గా మారింది. కొండా సురేఖ తన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా పనికిరాని వాటి మీద దృష్టి పెట్టి టైం వేస్ట్ చేస్తున్నారన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో పెర్మనెంట్ సూపరిండింటెంట్ లేడు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, ఇలాంటివి ఎన్నో సమస్యలున్నా…తాను అధికారులతో మాట్లాడితే తప్పు బట్టడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి సురేఖ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడడం భావ్యం కాదని వ్యాఖ్యలు చేశారు. నేను కేవలం తన నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు అధికారుల దగ్గరకు వెళ్లి మట్లాడనని, తాను అధికారుల దగ్గరకి వెళ్తే దాన్ని కూడా సమీక్ష అంటారా అని ఘాటుగా స్పందించారు. తన రాజకీయ జీవితంలో అధికారులతో మాట్లాడితే తప్పు బట్టిన మొదటి మంత్రి కొండా సురేఖ అని కడియం వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందులు, దేవాదాయ శాఖ మంత్రిగా తన అధికార పరిధిని ప్రశ్నించేలా ఇటీవల ఆయన వ్యవహరించిన తీరు పై సమాచారం అందించారు. ఈ సమస్యను సమగ్రంగా పరిశీలిస్తామని, సంబంధిత అంశాలపై చర్చిద్దామని మహేష్ కుమార్ మంత్రి కి హామీ ఇచ్చారు. గతంలో మంత్రి కొండా సురేఖ కు మరో సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య కూడా విబేధాలు తలెత్తాయి. తాజాగా కడియంతో సమస్యలు మొదలు కావడంతో వరంగల్ జిల్లా అధికార పార్టీ నేతల మధ్య విబేధాలు ఒక్కొక్కటిగా బయటకొస్తుండడం రాజకీయంగా హాట్ హాట్ గా మారుతోంది.
అయితే కొండా సురేఖ కడియం శ్రీహరి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కడియం తన సుదీర్ఘ రాజకీయ జీవితం కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారని ఆరోపించారు. దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలని లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనమా చేయాలని సూచించారు. కడియం శ్రీహరికి రాజకీయాలపై నిజాయితీ, చిత్త శుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలువాలని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి చేరిన తరువాత కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయయని సురేఖ అన్నారు. ఈ నెల 14వ తేదీన మీనాక్షి నటరాజన్ ను కలిసి కూడా కడియంపై ఫిర్యాదు చేస్తానని సురేఖ మీడియాకు తెలిపారు.












Leave a Reply