(హైదరాబాద్,న్యూస్ఇన్)
బీఆర్ ఎస్ పార్టీపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నిధులు 1400 కోట్ల రుపాయాలు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని, వాటిని అమర వీరుల కుటుంబాలకు కోటి చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తాను రాజకీయ పార్టీని పెట్టి ప్రజల్లోకి వస్తుంటే బీఆర్ ఎస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. తన పార్టీపై ఫిర్యాదులు చేస్తూ టీఆర్ ఎస్ అనే పేరు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హరీశ్ రావును కాళేశ్వరం అనకొండ అంటూ సంచలన ఆరోపణలు చేసిన కవిత.. ఆయన్ను బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోందన్నారు. కేటీఆర్ తన మిత్రుడు ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్కు క్విడ్ ప్రొ కో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ హాయంలో ఫినిక్స్ సంస్థకు 80 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనూ తాను ఉద్యమకారుల పక్షాన నిలబడ్డానని కవిత తెలిపారు కానీ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.












Leave a Reply