రెండేళ్లు గడిచాయి….. తోలు తీస్తా
రాష్ట్రంలో సర్వ భ్రష్ఠ ప్రభుత్వం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం……. ఇక ఉరుకునేది లేదు…ఇప్పటి వరకు ఓ లెక్క…..ఇకపై మరో లెక్క….. తోలు తీస్తా……రాష్ట్రానికి అన్యాయం జరిగితే చేతులు ముడుచుకుని కూర్చోలేను…ఇక ప్రజల్లోనే ఉంటా…… రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడుతా… నదీ జలాల వాటా కోసం పోరాటం మొదలు పెడతానని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. తెలంగాణా భవన్ లో ఆదివారం పార్టీ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం పార్టీ అధినేత కేసిఆర్ అధ్యక్షతన జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ నిర్వహణతో పాటు ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటాల గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసిఆర్ ప్రభుత్వ తీరుపై తన దైన స్టైల్లో స్పందించారు.

రాష్ట్ర రైతంగానికి ప్రభుత్వ తీరుతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హాయంలో పాలమూరు రంగారెడ్డి జిల్లా పథకం 90శాతం పూర్తి చేసిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పథకం గురించి పట్టించుకోలేదన్నారు. మరో వైపు ఏపీ కృష్ణా, గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతోందన్నారు.రాష్ట్ర ప్రజలకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరగుతోందని రైతులకు న్యాయం చేసే విధంగా తాము కార్యాచరణను అమలు చేయబోతున్నట్లు తెలిపారు. కృష్ణా బేసిన్ పరిధిలోని పాలమూరు,రంగారెడ్డి,నల్గొండ జిల్లాల్లో మొదటి విడతగా గ్రామ స్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి రోడ్ మ్యాప్ విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లో విఫలమై సర్వభ్రష్ఠ ప్రభుత్వంగా మారిందన్నారు.

సాగునీటి ఉద్యమంలో తాను కూడా పాల్గొంటానన్నారు. ప్రాథమికంగా కృష్నా బేసిన్ పరిధిల రెండు సభలు, గోదావరి బేసిన్ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలోనే సభలు నిర్వహించే అవకాశం ఉంది. పార్టీ సభ్యత్వ నమోదును కూడా త్వరలో మొదలు పెట్టాలని సమావేశం నిర్ణయించుకుంది. ఆన్ లైన్ – ఆఫ్ లైన్ హైబ్రీడ్ విధానంలో సభ్యత్వ నమోదును పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది.వచ్చే నెలలో సభ్యత్వ నమోదు మొదలుపెట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.
గులాబీ బాస్ నోటీ నుంచి టీఆర్ఎస్……

తెలంగాణా భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ ఎస్ అదినేత కేసిఆర్ నోరు జారారు. పార్టీ పేరును రెండు సార్లు టీఆర్ ఎస్ అని ప్రస్తావించారు.బీఆర్ ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం అని చెప్పేందుకు బదులుగా టీఆర్ ఎస్ ఎల్పీ, టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అని అంటూ మీడియా సమావేశాన్ని మొదలు పెట్టారు.దీంతో కేసిఆర్ నోటి నుంచి కావాలని టీఆర్ ఎస్ అని వచ్చిందా…..లేదంటే…. అనుకోకుండా వచ్చిందా అన్నది చర్చకు దారితీస్తోంది. మూడేళ్ల క్రితం టీఆర్ ఎస్ పార్టీ పేరును బీఆర్ ఎస్ పార్టీగా పేరును పార్టీ మార్పు చేసింది. ఇది గులాబీ పార్టీకి కలిసి రాలేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తూ పార్టీ పేరును మార్చి తెలంగాణాలో అధికారం కోల్పోయింది.



Leave a Reply