NewsInn

News in a Click

హ‌రీష్ కాంగ్రెస్ లో చేరితే మంత్రి ప‌ద‌విపై ఆలోచిస్తాం

హ‌రీష్ కాంగ్రెస్ లో చేరితే మంత్రి ప‌ద‌విపై ఆలోచిస్తాం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

హ‌రీష్ రావ్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంద‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు. మూడు నెల‌లు సాగునీటి మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే నీళ్లు ఇచ్చి చూపిస్తాన‌ని హ‌రీష్ రావ్ స‌వాల్ చేయ‌డంపై జ‌గ్గారెడ్డి మండి ప‌డ్డారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హాయంలోనే హ‌రీష్ రావ్ స‌మ‌క్షంలోనే డిజైన్, ప్లానింగ్ అన్ని జ‌రిగాయ‌ని, కూల‌డం కూడా బీఆర్ ఎస్ హాయంలోనే పూర్త‌యింద‌న్నారు. బీఆర్ ఎస్ చేసిన త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం భావ్యం కాద‌ని చెప్పారు. సాధార‌ణ గుడిసే వేసే వారు సైతం ఎంత లోతు నుంచి క‌ట్టాల‌న్న విష‌యం ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటార‌ని, బ్యారేజీల విష‌యంలో బీఆర్ ఎస్ ఆ నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. మూడేళ్లు సాగునీటి మంత్రిగా ఉండి ప్రాజెక్టు నిర్మాణం చేసి కూల్చి వేసిన చ‌రిత్ర కూడా హ‌రీష్ కు ద‌క్కుతుంద‌న్నారు. ఇప్పుడు మూడు నెల‌ల కోసం మంత్రి ప‌ద‌వి అడుగడం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష పార్టీగా ప్ర‌జ‌లకు మేలు చేసే సూచ‌న‌లు చేయాలి కాని ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డే స‌ల‌హాలు ఇవ్వ‌డం మంచిది కాద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *