NewsInn

News in a Click

ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఐదు రోజుల హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న ముగిసింది. ఈ నెల 17వ తేదీన హైద‌రాబాద్ చేరుకున్న ముర్ము ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. శీతాక‌ల విడిదికి ప్ర‌తిఏటా రాష్ట్రప‌తి రావ‌డం అనవాయితీ వ‌స్తోంది. ఐదు రోజుల పాటు బొల్లారం రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో బ‌స‌చేసిన ద్రౌప‌ది ముర్ముకు సోమ‌వారం హ‌కీంపేట ఏయిర్ పోర్టులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, మంత్రి సీత‌క్క‌లు వీడ్కోలు ప‌లికారు. ప‌లువురు ఉన్న‌తాధికారులు కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *