NewsInn

News in a Click

ఏ.కే.ఖాన్ కుమారుడి పై కేసు నమోదు

ఏ.కే.ఖాన్ కుమారుడి పై కేసు నమోదు

(హైదరాబాద్, న్యూస్ఇన్)

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ తనయుడు మోహిసిన్ ఖాన్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.మహారాగ్ని సినిమా కోసం పెట్టుబడిదారులను పరిచయం చేస్తానని చెప్పి 50 లక్షలు తీసుకున్నారని అనీష్ రెడ్డి ఆరోపిస్తున్నారు.మొహ్సిన్ ఖాన్‌కు 25 లక్షలు, తబ్రేజ్‌కు 25 లక్షలు మూడు విడతల్లో ఇచ్చినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.డబ్బులు తీసుకన్నా పెట్టుబడిదారులను పరిచయం చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు.

డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా కార్యాలయానికి పిలిచి బెదిరిస్తున్నారని ఆనీష్ రెడ్డి ఆరోపించారు. బౌన్సర్లతో అడ్డగించి ఆయుధాలు చూపించి భయభ్రాంతులకు గురి చేశారని, దాడి చేసినట్లు ఫిర్యాదు.తబ్రేజ్ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణ…మొహ్సిన్ ఖాన్, తబ్రేజ్‌ల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.బీఎన్‌ఎస్ సెక్షన్లు 126(2), 115(2), 352, 351(2), 3(5) కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *