NewsInn

News in a Click

యాదగిరిగుట్ట పాలక మండలి ప్రమాణ స్వీకారం

యాదగిరిగుట్ట పాలక మండలి ప్రమాణ స్వీకారం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప్ర‌భుత్వం ఇటీవ‌ల నియ‌మించించిన యాద‌గిరి గుట్ట తొలి పాల‌క మండ‌లి ఈ రోజు ప్ర‌మాణ స్వీకారం చేసింది. దేవాల‌య ప్రాంగ‌ణంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజ‌ర‌య్యారు. చైర్మ‌న్ గా పాల‌క మండ‌లి చైర్మ‌న్ గా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఎం. స‌త్యానారాయ‌ణ రెడ్డి తో పాటు మండ‌లి స‌భ్యులు ప్ర‌మాణం చేశారు. ఆలయ ముఖమండపం ప్రాంగణంలో మంత్రి సురేఖ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ యాదగిరి గుట్ట దేవస్థానాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని నూతన ట్రస్ట్ బోర్డుకు మంత్రి సూచించారు. గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దేవస్థానం ఖ్యాతిని మరింత పెంచే బాధ్యత నూతన పాలక మండలిపై ఉందన్నారు. ఆలయ పవిత్రత, సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, పాలక మండలి సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి దేవస్థానం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *