(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు 2029 మే, జూన్ లలో జరిగే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతా అనుకుంటున్నట్లు 2028 లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 అసెంబ్లీ స్థానాలు , 20 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు తప్పుడు సర్వేలతో ప్రజల్లో ఆందోళనలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా చింకాని మండలంలో జరిగిన రైతు భరోసా సభలో సీఎం పాల్గొన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసి బహిరంగ సభలో ప్రసంగించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ ఎస్ నేతలు పోటీ పడి కన్నేపల్లికి వెళ్లి మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్క సారి మేడి గడ్డ బ్యారేజ్ కుంగిపోతేనే ఇంత నష్టం జరిగిందని, నీళ్లు నింపితే భద్రాచలం రాముడు మునిగిపోతాడని సీఎం అన్నారు. బీఆర్ ఎస్ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలా అని అడిగితే ఆ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారన్నారు.
బీజేపీలోకి వెళ్లనని హరీష్ చెప్పగలరా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ ఎస్ పార్టీని బీజేపీతో విలీనం చేస్తారని ఆ ఇంటి మనిషే చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు క్విడ్ ప్రో కో లో భాగంగా వందల కోట్ల రుపాయాలు బీఆర్ఎస్ కు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ కూతురు చెబుతోందన్నారు.













Leave a Reply