(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేటలో హరీష్ రావ్ పై పోటీ చేసేందుకు సిద్ధమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయనని గతంలో ప్రకటించిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. సంగారెడ్డిలో తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారని జగ్గారెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 117 సీట్లు గెలుచుకునేందుకు అనుగుణంగా సీఎం,పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తే అందకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల గురించి ఇప్పటి నుంచి ఆలోచించడం సరైందనన్నారు. సర్వేలు ఎవరివి వారికి అనుకూలంగా రావడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఎమ్మెల్యేల పనితీరును దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేస్తున్నారని, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు విషయంలో సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జ్, హై కమాండ్ లు నిర్ణయం తీసుకుంటాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేయడం రాజకీయాల్లో రాజనీతిగా జగ్గారెడ్డి చెప్పారు. రాజకీయాల్లో ఎవరూ తోపులు కాదని, ఎప్పుడూ వారే ఉండరని జగ్గారెడ్డి వ్యాఖ్యనించారు.











Leave a Reply