NewsInn

News in a Click

ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు ఉత్తర్వులు

ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు ఉత్తర్వులు

(హైదరాబాద్, న్యూస్ఇన్‌)

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , వారి అర్హులైన కుటుంబ సభ్యులకు అందిస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రాథమిక వేతనం లేదా పెన్షన్ నుంచి 1.5 శాతం చందాను ఈహెచ్‌ఎస్ నిధికి జమ చేసే విధానాన్ని అమలు చేస్తూ కొత్త హెల్త్ స్కీంను అమ‌లు చేయాల‌ని స‌ర్కార్ గ‌తంలో నిర్ణ‌యం తీసుకుంది. అందుకు అనుగుణంగా గ‌త నెల నుంచి ఉద్యోగులు, పెన్ష‌నర్ల జీతం నుంచి కోత‌లు కూడా మొద‌ల‌య్యాయి. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త హెల్త్ స్కీం అమ‌లు చేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఆసుపత్రుల‌తో చ‌ర్చ‌లు పూర్తి కాక‌పోవ‌డంతో 15 వ తేదీ నుంచి అమ‌లు చేయ‌డం ప్ర‌భుత్వానికి సాధ్యం కాలేదు. కానీ రెండు రోజుల అనంత‌రం ఇందుకు సంబంధించిన జీఓ విడుద‌ల చేయ‌డంతో కొత్త ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్ల‌యింది.ఈ ప‌థ‌కం అమ‌లుకు ఏర్పాటు చేసిన ట్ర‌స్ట్ కు పూర్తి అధికారాలు క‌ట్ట‌బెడుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప‌థ‌కం పారద‌ర్శ‌కంగా అమలు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించి జీఓ విడుద‌ల తో పాటు విధి విధానాల‌ను కూడా ప్ర‌భుత్వం ఖరారు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *