NewsInn

News in a Click

ప‌ద‌వుల కోసం గాంధీ భ‌వ‌న్ చుట్టూ తిరుగొద్దు

ప‌ద‌వుల కోసం గాంధీ భ‌వ‌న్ చుట్టూ తిరుగొద్దు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు ప‌ద‌వుల కోసం గాంధీ భ‌వ‌న్ చుట్టూ తిర‌గ‌వద్ద‌ని ఆదేశించారు. గాంధీ భ‌వ‌న్ చుట్టూ తిరిగే నేత‌ల‌కు కీల‌క నేత‌లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వ‌వ‌ద్ద‌ని సూచించారు. SIRపై జ‌రిగిన జూమ్ స‌మావేశంలో సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ జూం మీటింగ్ లో బీఎల్ ఓ నుంచి ఏఐసీసీ నేత‌ల వ‌ర‌కు పాల్గొన్నారు. SIR గ‌డువు పొడ‌గించిన నేప‌థ్యంలో దీన్ని కూడా అవ‌కాశంగా మ‌లుచుకోవాల‌ని సీఎం నేత‌ల‌కు సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 489 స‌మావేశాలు స‌ర్ ప్ర‌క్రియ పై నిర్వ‌హించిన‌ట్లు వెల్ల‌డించారు. ప‌ద‌వులు కోరుకుంటున్న నేత‌లు గాంధీ భ‌వ‌న్ చుట్టూ తిరిగే కంటే అగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు స‌ర్ ప్ర‌క్రియ పూర్తి చేయ‌డంపై దృష్టి పెట్టాల‌ని సూచించారు. కొంత మంది నేత‌లు హైద‌రాబాద్ కు ప‌రిమితం మై క్షేత్ర స్థాయిలో ప‌ని చేయ‌డం లేద‌ని సీఎం వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నుంచి ఇంచార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హిస్తార‌ని సీఎం తెలిపారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎంపీలు ఉన్నా రోజు స‌మీక్ష‌లు చేయాల‌ని సూచించారు. బీఎల్ ఓ లు ఇచ్చే నివేదిక‌ల‌పై ఆధార ప‌డ్డ‌వ‌ద్ద‌ని ఆ నివేదికల వాస్త‌వాల‌ను కూడా బేరీజు వేసుకోవాల‌ని సీఎం సూచించారు. రాబోయే ప‌ది రోజులు నేతలంతా ఎన్నిక‌ల్లో ప‌నిచేసిన‌ట్లే చేయాల‌ని సీఎం సూచంచారు. ఈ నెల 30వ తేదీన మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించి శాస‌న‌స‌భా నియోజ‌క‌వ‌ర్గాల వారిగా నివేదిక‌లు తీసుకుంటామ‌న్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లను సమన్వయం చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *