(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, తీసుకోవాల్సిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న ఆ జిల్లా స్థాయి సమావేశాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సిఎస్ ఆదేశించారు. ఎల్-నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు వ్యవసాయంపై చూపే ప్రభావం గురించి రైతులు, ప్రజాప్రతినిధులు, వారికి విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సిఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ప్రసుత్త పరిస్థితులపై సమీక్షించేందుకు ఆయా జిల్లా ఇన్చార్జి మంత్రులు జిల్లాల్లో పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని అధిక శాతం జిల్లాల్లో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సిఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ విధానాలు, అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళికలపై అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంటల వైవిధ్యీకరణ (Crop Diversification) ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకుని జీవనోపాధిని కాపాడుకోవచ్చని సూచించారు.రైతులకు శాస్త్రీయ, సాంకేతిక సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రోజంతా నిర్వహించేలా రూపొందించినట్లు సిఎస్ తెలిపారు.













Leave a Reply