NewsInn

News in a Click

క్షేత్ర స్థాయి పర్యటనలకు పవన్ కళ్యాణ్ దూరం

క్షేత్ర స్థాయి పర్యటనలకు పవన్ కళ్యాణ్ దూరం

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

ఇటీవల కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పిఠాపురం, పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా జనసమూహం మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్ర చికిత్స చేసిన భుజానికి ఏ మాత్రం అసౌకర్యం కలిగినా గాయం తిరగబెడుతుందని, అలాంటి పరిస్థితి ఏర్పడితే మరోమారు సరిచేయడం కూడా క్లిష్టతరమవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఎడమ భుజానికి కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. కనీసం మరో రెండు వారాల పాటు క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సూచించారు. వైద్యుల సలహా మేరకు క్షేత్ర స్థాయి పర్యటనల షెడ్యూలు మార్చాలని కార్యాలయ అధికారులకు సూచనలు చేశారు.అదే సమయంలో అధికారిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *