(బెంగుళూరు,న్యూస్ఇన్)
కర్ణాటక రాష్ట్రంలో పులిరాజు కేసులు కలకలం రేపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ కేసులు అదుపులోకి తెచ్చేందుకు అంతర్జాతయ సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా
దేశంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. దీని ఫలితాలు కూడా ఏయిడ్స్ కట్టడికి కలిసి వచ్చాయి. కర్నాటకలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేతో ఏయిడ్స్ కేసులు భారీగా పెరిగినట్లు నివేదికలు అందడం సంచలనంగా మారింది. కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. అదికూడా యువత ఎక్కువ హెచ్ ఐవీ బారిన పడుతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతోంది. ఏయిడ్స్ వ్యాధిని అరికట్టేందుకు అవగాహన పెంచాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ ఏయిడ్స్ నియంత్రణ సంస్థ ఇటీవల జరిపిన సర్వేలతో కొత్త గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హెచ్ ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. బళ్లారి, బెంగుళూరు, మైసూరు, కలుబురిగి,రాయిచూరు, కొప్పల్, బగల్ కోట్, బెళగావి, ధావణ గిరి ప్రాంతల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కొన్ని జిల్లాల్లో ఏయిడ్స్ నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తోంది. బెంగుళూరు, మైసూరు, బళ్లారి వంటి ప్రాంతాల్లో కొత్త కేసుల నమోదు సంఖ్య భారీగా పెరిగింది. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వారు ఈ వ్యాధి బారిన పడుతుండడంతో ప్రభుత్వం అన్ని కళాశాలల్లో హెచ్ ఐవీ పరీక్షలు నిర్వహించడంతో పాటు యువతో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (KSAPS) సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ ఏడాది గుర్తించిన కేసుల్లో 7 వేల మంది 18 నుంచి 25 ఏళ్ల మధ్య లో హెచ్ ఐ వీ పాజిటివ్ బాధితులుగా మారినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ముందుస్తుగా వ్యాధి నివారణ చర్యలు చేపట్టే దిశగా నిర్ణయాలు అమలు చేస్తోంది.

అన్ని కళాశాలల్లో HIV పరీక్షలు, కౌన్సెలింగ్ శిబిరాలు
విద్యార్థులకు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించడం
అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం
సురక్షిత లైంగిక సంబంధాలు, HIV వ్యాప్తి మార్గాలు
ఏయిడ్స్ నివారణ పద్ధతులపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించడం.
యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) అందుబాటును విస్తరించడం.
HIV పాజిటివ్గా గుర్తించిన వారికి వెంటనే ఉచిత చికిత్స ప్రారంభించడం.
హెచ్ ఐవీ కేసులు ఎక్కువగా నమోదయ్యేందుకు పలు కారాణాలను కర్నాటక వైద్యశాఖ గుర్తించింది. సురక్షిత విధానాలు అవలంభించకపోవడం కీలకమైనదిగా అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో పెరుగుతున్న డేటింగ్ సంస్కృతి, యాప్స్ వినియోగం పెరగడం, వలస కార్మికులు, పట్టణీకరణ ప్రధాన అంశాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు పరీక్షలు చేయించుకోకపోవడం, సరైన చికిత్స పొందేందుకు వెనుకడుగు వేయడం కూడా ఒక కారణంగా హెచ్ ఐవీ కేసులు పెరిగేందుకు కారణమని అధికారులు గుర్తించారు.
పొరుగురాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత హెచ్ ఐవీ బారిన పడుతుండడంతో తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం కావాలన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. రోజు వేలాది మంది బెంగుళూరుకు రాకపోకలు సాగిస్తుండడం…వేలాది మంది అక్కడే వృతి వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో తెలుగు రాష్ట్రాల అధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.












Leave a Reply