NewsInn

News in a Click

వివాదంలో సీఎంఓ….గెస్ట్ హౌస్ కు వ‌స్తావా…. చ‌ర్చింద్దాం..!

వివాదంలో సీఎంఓ….గెస్ట్ హౌస్ కు వ‌స్తావా…. చ‌ర్చింద్దాం..!

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

తెలంగాణ సీఎం ఓ మ‌రోసారి వివాదాల్లోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి స‌న్నిహితులుగా ఉండే నేత‌ల వ్య‌వ‌హార శైలి మ‌రోసారి వివాదాస్ప‌దంగా మారుతోంది. ఓ మ‌హిళా వ్యాపార వేత్త చేసిన ట్వీట్ తెలంగాణా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారి తీసేలా క‌నిపిస్తోంది. మీడియా రంగంలో ఉన్న ఆ మ‌హిళా వ్యాపార వేత్త త‌న సంస్థ‌కు ప్ర‌క‌ట‌న‌లను న్యాయ బద్ధంగా ఇవ్వాల‌ని కోరుతోంది. కాని ఆ మ‌హిళా వ్యాపార వేత్త నిర్వ‌హించే సంస్థ‌కు ప్రభుత్వ ప్ర‌క‌ట‌న‌లు రాలేదు. దీంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసేందుకు ఆ మ‌హిళ య‌త్నాలు చేస్తూ వ‌చ్చి త‌న స‌మ‌స్య చెప్ప‌కునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలో సీఎం కు అత్యంత స‌న్నిహితుడిగా గుర్తింపు ఉన్న ఓ నేత‌ను ఆ మ‌హిళ సంప్ర‌దించింది. కానీ ఆ నేత నుంచి వ‌చ్చిన స‌మాధానం విని ఆశ్చ‌ర్య పోవాల్సి వ‌చ్చింది. ఆ ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు సీఎం స‌న్నిహితుడిగా గుర్తింపు ఉన్న నేత ఓ గెస్ట్ హౌస్ కు వ‌స్తే చ‌ర్చిద్దామ‌ని మ‌హిళా వ్యాపార వేత్త‌కు ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. దీంతో ఖంగు తిన్న మ‌హిళా వ్య‌పార వేత్త …..తాను ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ట్వీట్ చేసింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేయ‌డంతో మ‌రోసారి ఈ వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారింది.

సోష‌ల్ మీడియాలో ఈ వ్య‌వ‌హారం తీవ్ర దూమారం రేపుతోంది. ట్వీట్ పై ప‌లువురు నెటిజ‌న్లు స్పందిస్తూ… ఆ నేత పేరు కూడా బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆ నేత పేరు బ‌య‌ట‌పెడితే…. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌న్న సూచ‌న‌లు చేస్తున్నారు.

అయితే మ‌హిళా వ్యాపార వేత్త ట్వీట్ తో మ‌రోసారి మిస్ వ‌రల్డ్ పోటీల సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. విదేశీ అందాల భామ దాదాపు ఇదే ప‌రిస్థితి ఎదుర్కొంద‌న్న వార్త‌లు అప్ప‌ట్లూ దూమారం రేపాయి. అందాల పోటీల్లో చివ‌రి వ‌ర‌కు కొన‌సాగ‌కుండా స్వ‌దేశానికి వెళ్లి తీవ్ర విమర్శ‌లు చేసింది. విదేశీ మ‌హిళ కావ‌డంతో… అంత‌ర్జాతీయంగా తెలంగాణా ప‌రువు పోయిందంటూ గ‌తంలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా మ‌హిళా వ్యాపార వేత్త‌కు దాదాపు అలాంటి ప‌రిస్థితులు ఎదురు కావ‌డం హాట్ హాట్ గామారింది. తెలంగాణా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌హా, సీఎం ఓ, మంత్రి సీత‌క్క‌ , సీనియ‌ర్ అధికారి జ‌యేష్ రంజ‌న్ ల‌తో పాటు న‌గ‌ర ప‌రిధిలోని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు ట్వీట్ ను ఆ మ‌హిళా పారిశ్రామిక వేత్త ట్యాగ్ చేసింది. ఈ వ్య‌వ‌హారంతో తెలంగాణా రాజ‌కీయాల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించే వారికి ఈ ఘ‌ట‌న‌పై ఒక అవగాహ‌న, అంచ‌నా వ‌చ్చి ఉంటుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

అయితే గ‌తంలో విదేశీ మ‌హిళా కేసును లైట్ గా తీసుకున్న సర్కార్…ఈ ట్వీట్ పై ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ఉత్కంఠ రేపుతోంది. త‌న స‌న్నిహితులుగా చెప్పుకునే వారిపై వ‌స్తున్న ఇలాంటి ఆరోప‌ణ‌ల‌పై సీఎం ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది ఆస‌క్తి రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *