NewsInn

News in a Click

దానం పై అన‌ర్హ‌త ….ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్

దానం పై అన‌ర్హ‌త ….ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

సీనియ‌ర్ నేత దానం నాగేంద‌ర్ పై కోర్టు అన‌ర్హ‌త వేటు వేయ‌డంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ పెరుగుతోంది. దానం త‌రువాతి కేసు క‌డియం శ్రీహ‌రి కేసు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో క‌డియం శ్రీహ‌రి టెన్ష‌న్ తో స‌త‌మ‌తం అవుతున్నార‌ట‌. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న క‌డియం శ్రీహ‌రి రాష్ట్ర ఆవిర్భావం త‌రువాత గులాబీ గూటికి చేరుకున్నారు. గులాబీ పార్టీలో చేరిన ఆయ‌న‌కు తొలిసారి పార్టీ ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. ఉప ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం క‌ల్పించింది. ఎంపీగా కూడా కొన‌సాగించింది. ఎమ్మెల్యే టికెట్ క‌ట్ట‌బెట్టింది….. కానీ 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ అధికారం కోల్పోయి…త‌న అనుభ‌వంతో రాజ‌కీయంగా చ‌క్రం తిప్పుకునే ప్ర‌య‌త్నాల‌ను క‌డియం చేశారు. త‌న కూతురుకు కావ్య‌కు బీఆర్ ఎస్ ఎంపీ టికెట్ ను బీఆర్ ఎస్ పార్టీ ఖరారు చేసింది. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్ల‌ను పార్టీ చేస్తూ వ‌చ్చింది.

కానీ చివ‌రి నిమిషంలో బీఆర్ ఎస్ కు షాక్ ఇచ్చి క‌డియం కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ కావ్య‌కు ఖ‌రారు కావ‌డంతో రాత్రి రాత్రే ప్లేటు ఫిరాయించి కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా కావ్య‌ను ప్ర‌క‌టింప చేశారు. ఒక్క రోజులునే గులాబీ పార్టీ అభ్య‌ర్థి స్థానంలో కావ్య కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మారి వ‌రంగ‌ల్ ఎంపీ స్థానం విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో గులాబీ పార్టీ క‌డియం శ్రీహ‌రి అనుస‌రించిన విధానంతో తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూనే. ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్సీకర్ ను కోరుతూనే న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించింది. కూతురు ఎంపీగా పోటీ చేస్తే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న క‌డియం శ్రీహ‌రి ప్ర‌తిపాదించార‌ని బీఆర్ఎస్ వాదిస్తోంది. పార్టీ ఫిరాయింపు ల‌కు క‌డియం పాల్ప‌డ‌డంతో ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని బీఆర్ ఎస్ న్యాయ స్థానంలో పోరాటం చేస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో స్పీక‌ర్ నిర్ణ‌యం పై హై కోర్టును బీఆర్ ఎస్ ఆశ్ర‌యించ‌డంతో దానం నాగేంద‌ర్ పై అన‌ర్హ‌త వేటును హై కోర్టు వేసింది. ఇక త‌దుప‌రి కేసు లో కోర్టు క‌డియం శ్రీహ‌రిపై కూడా అన‌ర్హ‌త వేటు వేస్తుంద‌న్న ధీమాను గులాబీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

దానం పై తీర్పు వెల్ల‌డి కావ‌డంతో…. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల పై అదే తీర్పు వ‌స్తుంద‌న్న అనుమానాలు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లను వెంటాడుతున్నాయి. ప‌ఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. మ‌రో ఎమ్మెల్యే కూడా చేరుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. హై కోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *