మాజీ సీఎం కేసీఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణలో మళ్లీ బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని గ్రామాలకు మంచి రోజులు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన వ్యవసాయ క్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామపంచాయతీ నూతన కార్యవర్గాలతో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. గ్రామాల్లో పరిస్థితులపై వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అన్ని ఇబ్బందులే ఉన్నాయని కొత్త సర్పంచ్,వార్డు మెంబర్లు మాజీ సీఎంకు వారి అభిప్రాయాలు చెప్పారు.

ఈ సమావేశంలో ఉన్న ఒక గ్రామస్థుడు మాట్లాడుతూ…
“సార్ తమరి హయాం మా పల్లెలకు సువర్ణ యుగం… ఇప్పుడేముంది సార్…గోస మిగిలిందన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…” మనకు అన్ని కాలాలు అనుకూలంగా వుండయి. కొన్ని కొన్ని సమయాలు కష్టాలు వస్తయి., వాటికి వెరవకూడదు. మల్లా మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయి., అప్పడిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దు., గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలె ” …అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.


కొత్తగా ఎన్నికైతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ, మన పల్లె అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచి, నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఆ గ్రామ ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్ సహా వార్డు మెంబర్లు., నర్సన్న పేట గ్రామ సర్పంచ్ గిలక బాల నర్సయ్య సహా ఇరు గ్రామాలకు చెందిన ప్రముఖులు సమావేశంలో హాజరయ్యారు.





Leave a Reply