(హైదరాబాద్,న్యూస్ఇన్)
వాళ్లు అబద్దాలు అపేవరకు నేను నిజాలు చెబుతూనే ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటిఆర్ హరీష్ రావ్ లపై ఫైర్ అయ్యారు. సనత్ నగర్ లో నిర్మించిన టిమ్స్ ను ప్రారంభించి ప్రసంగించారు. విద్యా , వైద్యం, మహిళా, రైతు ల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. తామే టిమ్మ్స్ కట్టామని చెబుతున్న బీఆర్ ఎస్ నేతులు ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంగా వైద్య సేవలను మెరుగు పరుస్తామన్నారు. వైద్య విద్యకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున అవకాశాలున్నాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ రూ. 2,700 కోట్లు, సీఎం ఆర్ ఎఫ్ కోసం 2,526 కోట్లు ఖర్చా చెసినట్లు వెల్లడించారు. రెండేళ్లలో వైద్య ఆరోగ్య శాఖ కోసం 21 వేల 800 కోట్ల రుపాయాలను వెచ్చించడం జరిగిందన్నారు. ఉస్మానియా ఆసుపత్రి శిథిలా వస్థకు చేరితే…పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ఆ ఆసుపత్రి నిర్మాణం గురించి ఎందుకు పట్టించుకోలేదన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంతో శంకుస్థాపన చేసి వదిలేస్తే…కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సనత్ నగర్, ఎల్పీనగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే 10 వేల పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తామన్నారు. ఒక్కో ఆసుపత్రికి ఒక్కో డైరెక్టర్ ను నియమించి కార్పోరేట్ వైద్యం పేదలకు అందిస్తామని సీఎం చెప్పారు.

బీఆర్ ఎస్ నేతలు మారకూడదు….
2034 సంవత్సరం వరకు బీఆర్ ఎస్ నేతల్లో ఎలాంటి మార్పు రావద్దని తాను కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. బీఆర్ ఎస్ నేతలు అబద్దాలు చెబుతున్న వరకు తాను నిజాలే ప్రజలకు చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆసుపత్రులు మేమే కట్టామని చెబుతున్న నేతలు ఎందుకు ప్రారంభించలేదన్నారు. ఇప్పటికైనా బీఆర్ ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సీఎం సూచించారు. ఆసుపత్రిని ప్రారంభించి ఆసుపత్రిలోని విభాగాలను సీఎం పరిశీలించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.













Leave a Reply