పట్టుబడ్డ హర్యానా యువకులు
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు హై టెక్ కాపీయింగ్ కు పాల్పడుతూ పట్టు బట్టారు. హర్యానకు చెందిన యువకులు అనీల్, సతీష్ లు ప్రవేశపరీక్షకు హాజరై వారు వ్యవహరిస్తున్న తీరుతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.

పరీక్ష రాస్తూ తరచూ బాత్ రూం కు వెళ్లి వస్తుండడంతో మరింత క్షుణ్ణంగా వారిపై దృష్టి సారించారు. చెవిలో ఉన్న బ్లూటూత్ బీప్ శబ్దం ఆ ఇద్దరినీ పట్టించింది.బ్లూటూత్ పరికరం ద్వారా సమాధానాలు వింటూ పరీక్ష రాస్తున్న సమయంలో అనిల్ చేవిలో ఉన్న బ్లూటూత్ నుంచి బీప్ శబ్దం వచ్చింది. దీంతో ఇన్విజిలేటర్ వారి వ్యవహారన్ని పసిగట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి స్కానర్లు,బ్లూటూత్ పరికరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.




Leave a Reply