NewsInn

News in a Click

భార‌తీయులు – బిర్యానీ ప్రియులే

భార‌తీయులు – బిర్యానీ ప్రియులే

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

భార‌తీయులు త‌మ భోజ‌నాన్ని బిర్యానితో పూర్తి చేయ‌డం ఎంతో ఇష్టంగా భావిస్తోంది.ఏ ఫంక్ష‌న్లు అయినా బిర్యాని లేనిదే ఆ సంబ‌రం పూర్తి కాదు…..ఆన్ లైన్ లో కూడా ఇదే ట్రెండ్ గా సాగుతోంది. ఇంట్లో బిర్యాని వండుకుని తినేకంటే…ఆన్ లైన్ ఆర్డ‌ర్ ఇవ్వ‌చ్చు అనే దాకా ఆన్ లైన్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఎన్నో ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ‌లు రెస్టారెంట్లతో వ్యాపారం మొద‌లు పెట్ట‌డంతో బిర్యాని నిరంత‌రం అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. ఇక ఈ స్థాయిలో అందుబాటులో ఉంటే మ‌నం ఊరుకుంటామా లొట్ట‌లేసుకుంటూ బిర్యాని ఆర్డ‌ర్ ఇచ్చేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తాం….ఇదే విష‌యం స్విగ్గీ ఏడాది ముగింపు నివేదిక‌లో వెల్ల‌డైంది. బిర్యాని తో పాటు, బ‌ర్గ‌ర్, పిజ్జాలు ఎక్కువ‌గా ఆర‌గించారు. ద‌క్షిణ భార‌త దేశ వంటకం దోసా కూడా ఈ జాబితాలో స్థానం ద‌క్కించుకుంది. అయితే బిర్యాని త‌రువాతే వీట‌న్నంటి స్థానాలు.

2025లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకాలు….

బిర్యానీలు – 93 మిలియన్లు
బర్గర్లు – 57.7 మిలియన్లు
పిజ్జాలు – 40.1 మిలియన్లు
దోసాలు – 26.2 మిలియన్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *