NewsInn

News in a Click

లండన్‌లో తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

లండన్‌లో తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

(న్యూస్ఇన్,హైదరాబాద్)

తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్‌ ప్రగతికి సంబంధించిన తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలుగు ప్రవాసులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణవాసులు కూడా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

లండన్‌లో తెలుగు ప్రవాసులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులు, భవిష్యత్‌ ప్రగతి అంశాలపై ప్రవాసులతో వారు చర్చించారు. తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

CM Revanth Reddy In London Tour

తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా బలంగా ప్రచారం చేయాలని, రాష్ట్రానికి మంచి రాయబారులుగా ప్రవాసులు వ్యవహరించాలని సీఎం కోరారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి అవకాశాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంలో ప్రవాసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం, ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులు కూడా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రవాసులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *