(మెదక్,న్యూస్ఇన్)
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి – నిర్మల దంపతుల కుమారుడు భరత్ సాయి రెడ్డితో రమేష్ పటేల్ – మాయ పటేల్ దంపతుల కుమార్తె పాలక్ పటేల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజ నరసింహ, శ్రీదర్ బాబు, జానారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.












Leave a Reply