NewsInn

News in a Click

మార్పు రావాలి – మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రుగాలి

మార్పు రావాలి – మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రుగాలి

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్ర‌భుత్వంలో మార్పు రావాలని, మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ జ‌రుగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ తీరుపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌న్న విష‌యాన్ని ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. ఏ రాజ‌కీయ పార్టీలో కూడా క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు త‌గాదాలు త‌గ్గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ ముఖ్య‌మని, వీట‌న్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి అదుపులో ఉంచ‌గ‌లిగితే మ‌రోసారి పార్టీ అధికారంలోకి వ‌చ్చే చాన్స్ ఉంద‌న్నారు. మీడియాతో ఇష్టా గోష్టిగా మాట్లాడిన ప‌లు అంశాల‌పై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఉత్సాహ వంతుడని ఆయ‌న కు నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఇవ్వాల‌న్నారు. పార్టీ నేత‌లు కూడా అంతా స‌హ‌క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ప‌థ‌కాల‌నే ఈ ప్ర‌భుత్వం కొన‌సాగిస్తూ కొత్త‌గా మ‌రిన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు. రైతు భ‌రోసా ప‌థ‌కాన్ని అర్హులైన రైతుల‌కు మాత్ర‌మే ఇవ్వాల‌ని సూచించారు. 22 ఏ గ‌త ప్ర‌భుత్వ హాయం నుంచి ఉంద‌ని, కాని ఇప్పుడు వివాదంగా మారింద‌న్నారు. 22ఏ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అర్హ‌లైన ల‌బ్ది దారుల‌కు మాత్ర‌మే అందాలన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలపై మ‌రింత ప్ర‌చారం చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *